Home గాసిప్స్ ఓరినీ…మళ్ళీ డైరెక్టర్ మరాడా….మరోసారి చిరు సినిమా షాకివ్వనుంది!!

ఓరినీ…మళ్ళీ డైరెక్టర్ మరాడా….మరోసారి చిరు సినిమా షాకివ్వనుంది!!

0

ఏ ముహూర్తాన ఈ రీమేక్ ని తెలుగు లో తీసుకు రావాలని మెగాస్టార్ ఫిక్స్ అయ్యాడో కానీ ఆది నుండి ఎదో ఒక అడ్డంకి ఈ సినిమా కి వస్తూనే ఉంది, డైరెక్టర్స్ ఒకరి తర్వాత ఒకరు మారుతూనే ఉన్నారు సినిమా కథ మాత్రం అస్సలు సెట్ అవ్వడం లేదు… ఆ సినిమానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ మూవీ తెలుగు రీమేక్… ఈ రీమేక్ ను ఎప్పుడో కన్ఫాం చేశారు..

కానీ అప్పటి నుండి తెలుగు లో డైరెక్టర్స్ ఒకరి తర్వాత ఒకరు మారుతూ పోతున్నారు కానీ కథ ఓకే అవ్వడం లేదు, ముందు కథని ఓకే చేసిన తర్వాత సాహో డైరెక్టర్ సుజిత్ ను తీసుకోగా కథ లో తన స్టైల్ మార్పులు చేసినప్పుడు నో చెప్పారు.

తర్వాత ప్రాజెక్ట్ నుండి సుజిత్ ప్లేస్ లో వినాయక్ ను తీసుకోగా ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యి ఇక పట్టాలు ఎక్కుతుంది అనుకున్నారు. కథలో వినాయక్ చేసిన మార్పులు నచ్చక పోవడం తో రెండు మూడు వర్షన్స్ మార్చినా సాటిస్ ఫై గా లేక పోవడం తో వినాయక్ కూడా…

రేసు నుండి తప్పుకోవాల్సి వచ్చింది, తర్వాత ధృవ ఒరిజినల్ వర్షన్ డైరెక్టర్ మోహన్ రాజా ను ఈ రీమేక్ లో తీసుకుని అఫీషియల్ గా భాద్యతలను అప్పగించగా ఇప్పటి వరకు సినిమా కథ డెవెలప్ మెంట్ పై ఎలాంటి అప్ డేట్ లేదని తెలుస్తుంది. చేసిన కొన్ని మార్పులు ముందు నచ్చినా ఓవరాల్ మార్పులు అంతంత మాత్రమే ఉండటం తో…

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి మోహన్ రాజా కూడా తప్పుకున్నారు అంటూ టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో చర్చలు గట్టిగా జరుగుతున్నాయి. ఇక మెగాస్టార్ కూడా ఈ కథ ని కంప్లీట్ గా పక్కకు పెట్టి కొత్త కథ ను ఓకే చేయడం బెటర్ అని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఇంత మంది డైరెక్టర్స్ మారినా కథ సెట్ కాక పోవడం ఒకింత షాకింగే అని చెప్పాలి. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here