చిత్ర ప్రమోషన్స్లో భాగంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్స్, టీజర్, పాటలు, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్ర ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జోరిగె శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. తమ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాను చూసిన సెన్సాన్ బోర్డు సభ్యులు అప్రిషియేట్ చేయడంతో.. సినిమాపై నమ్మకం మరింతగా పెరిగిందన్నారు. రేపే తమ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. అన్ని వర్గాలకు నచ్చేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో నటీనటులు కొత్తవాళ్లైనప్పటికీ.. చాలా బాగా చేశారని చెప్పారు. ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠభరితంగా ఉంటుందన్నారు.
సస్పెన్స్కి తోడు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు.
నటీనటులు:
సుధాకర్ జంగం, లావణ్య, సిరి కనకన్, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకుడు: శ్యామ్ మండల
నిర్మాత: జోరిగె శ్రీనివాస్ రావు
బ్యానర్స్: రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్
కో ప్రొడ్యూసర్: అవినాష్ ఎ.జగ్తప్
లైన్ ప్రొడ్యూసర్: పళని స్వామి
సినిమాటోగ్రాఫర్: శివా రెడ్డి సావనం
మ్యూజిక్: సందీప్ కుమార్ కంగుల
ఎడిటర్: జె.పి
పిఆర్ఓ: సాయి సతీశ్, పర్వతనేని రాంబాబు