Home గాసిప్స్ నితిన్-అఖిల్ లతో పోటి పడబోతున్న గోపీచంద్!

నితిన్-అఖిల్ లతో పోటి పడబోతున్న గోపీచంద్!

0

మార్చ్ లో మూసుకున్న థియేటర్స్ ఇప్పటికీ తెరచుకోలేదు, మరో పక్క మార్చ్ లో మొదలైన కరోనా ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా జోరు చూపుతూ ఇండియా వైడ్ గా రికార్డ్ స్థాయి కేసులతో దూసుకు పోతూనే ఉంది, కానీ అప్పటి తో పోల్చితే ఇప్పుడు రికవరీ రేటు మాత్రం బాగా పెరగడం తో అసలు బయట ఎవరూ ఈ కరోనా ని పట్టించుకోవడం లేదు. దాంతో దాదాపుగా థియేటర్స్ ఓపెన్ తప్ప మిగిలినవన్నీ కూడా…

నార్మల్ గానే ఉన్నాయి అని చెప్పాలి. థియేటర్స్ ని మాత్రం దసరా టైం కి రీ ఓపెన్ చెస్తారు అనే టాక్ ఉండగా టాలీవుడ్ లో కొన్ని సినిమాలు మాత్రం ఆల్ రెడీ సంక్రాంతి ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే, ముందు నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగ్ దే ని…

సంక్రాంతి రేసులో నిలపబోతున్నట్లు అనౌన్స్ చేయగా తర్వాత అఖిల్ గీతా ఆర్ట్స్ లో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ని కూడా సంక్రాంతి కి అనౌన్స్ చేశారు. వేరే సినిమాలు ఏవి కూడా ఇంకా కన్ఫాం కాలేదు కానీ ఇప్పుడు మాస్ స్టార్ గోపీచంద్…

తమన్నా తో కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సీటి మార్ ని కూడా సంక్రాంతి రేసు లో నిలపాలి అని చూస్తున్నాడని టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్. సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలే ఉండగా వరుస ఫ్లాఫుల్లో ఉన్న గోపీచంద్ ఈ సినిమా తో కంబ్యాక్ ఇవ్వాలని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండటం తో…

ప్రస్తుతానికి పెద్దగా పోటి లేని సంక్రాంతి ని టార్గెట్ చేస్తే టాక్ బాగుంటే సీజన్ ఎఫెక్ట్ వలన కచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ కొట్టొచ్చు అన్న ప్లానింగ్ లో ఉన్నారని సమాచారం. మరి బాలెన్స్ షూట్ అప్పటికి కంప్లీట్ అయ్యి ఆల్ రెడీ షూటింగ్ ఎండ్ స్టేజ్ లో ఉన్న మిగిలిన 2 సినిమాలతో పోటి ని కన్ఫాం చేసుకుంటుందో లేదో అన్నది మాత్రం త్వరలో కన్ఫాం అవుతుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here