Home గాసిప్స్ లోకల్ థియేటర్స్ లో లక్ష్మీ పైరసీ….టీం ఎంత ఫైన్ వేశారంటే!!

లోకల్ థియేటర్స్ లో లక్ష్మీ పైరసీ….టీం ఎంత ఫైన్ వేశారంటే!!

0

అక్షయ్ కుమార్ కీయరా అద్వాని ల కాంబినేషన్ లో రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ బాంబ్ పేరు మార్చుకుని లక్ష్మీ గా రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి నార్త్ లో కంప్లీట్ నెగటివ్ రివ్యూలు దక్కగా సౌత్ లో పర్వాలేదు అనిపించే టాక్ లభించింది. కానీ సినిమా కి వ్యూస్ పరంగా సాలిడ్ వ్యూస్ దక్కి ఆల్ మోస్ట్…

150 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని అందుకుందని అంటున్నారు. మరో పక్క సినిమా పైరసీ మొదటి రోజే వచ్చేయడంతో పైరసీ కూడా బాగానే చూస్తున్నారు. ఇక వీటితో పాటు ఇప్పుడు సినిమా ను థియేటర్స్ లో కూడా పైరసీ చేస్తున్నారట.

అంటే జనాలు థియేటర్స్ కి వచ్చి సినిమాను పైరసీ చేయడం కాదు, ఏకంగా థియేటర్ ఓనర్లే సినిమా పైరసీ మాస్టర్ ప్రింట్ ని థియేటర్స్ లో ప్రదర్శిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారట. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో నార్త్ అలాగే కొన్ని సౌత్ సైడ్ థియేటర్స్ లో ఇలా పైసరీ ప్రింట్ ని ప్రదర్శిస్తూ నార్మల్ టికెట్ రేట్స్ తో సినిమాను…

థియేటర్స్ లో ఆడిస్తున్నారని న్యూస్ ట్రేడ్ లో చక్కర్లు కొట్టగా ఈ వార్తా ఇటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి అటు యూనిట్ కి వెళ్ళగా వాళ్ళు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోబోతున్నారట. సినిమా ఇండియా లో కేవలం డిజిటల్ రిలీజ్ మాత్రమె అవకాశం ఉందని, థియేటర్స్ లో రిలీజ్ చేసుకునే అవకాశం లేదని, అందువలన అలా చేస్తే మినిమమ్ 5-10 లక్షల జరిమానా…

కట్టాల్సి ఉంటుందని చెప్పారట. అయినా కానీ కొన్ని థియేటర్స్ లో ఇంకా ప్రదర్శిస్తూ ఉండటంతో ఇప్పుడు ఆ థియేటర్స్ కి 10 లక్షల జరిమానా కట్టాలని నోటిసులు పంపారని టాక్ ఉంది. థియేటర్స్ కి జనాలను రప్పించడానికి ఇలా చేయడం తప్పే కానీ కొత్త సినిమాలు రిలీజ్ అయితేన కథ జనాలు మళ్ళీ థియేటర్స్ కి వచ్చేది అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here