Home న్యూస్ జపాన్ లో మగధీర సునామీ…20 కోట్లతో మైండ్ బ్లాంక్

జపాన్ లో మగధీర సునామీ…20 కోట్లతో మైండ్ బ్లాంక్

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి ల కాంబినేషన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ మగధీర బాక్స్ ఆఫీస్ భీభత్సం రిలీజ్ అయిన 9 ఏళ్లకి కూడా కొనసాగుతుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది… సినిమా రీసెంట్ గా జపాన్ లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా 10 రోజుల్లోనే సంచలనం సృష్టించింది ఈ సినిమా.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఏకంగా 17.47 కోట్ల గ్రాస్ ని వసూల్ చేయగా సినిమా వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో ఓవరాల్ గా హిస్టారికల్ 20 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్నట్లు సమాచారం.

ఇది నిజంగానే భీభత్సమైన రికార్డ్ అని చెప్పాలి. సినిమా రిలీజ్ అయిన 13 రోజుల్లో అక్కడ ఓవరాల్ గా 2.8 మిలియన్ కి పైగా డాలర్స్ ని వసూల్ చేసిందట…చూస్తుంటే సినిమా ఇప్పట్లో ఆగే అవకాశం లేదు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి టోటల్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here