Home గాసిప్స్ 6 ఏళ్ల క్రితం ఆపేసిన సినిమా మళ్ళీ తెరపైకి!…ఇక రచ్చ రచ్చే!!

6 ఏళ్ల క్రితం ఆపేసిన సినిమా మళ్ళీ తెరపైకి!…ఇక రచ్చ రచ్చే!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇచ్చిన సినిమా ఖైదీ నంబర్ 150 అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా ప్లేస్ లో ప్రతిష్టాత్మక 150 వ సినిమాగా అనేక కథలను విన్న మెగాస్టార్ చిరంజీవి అందులో కొన్ని కథలను ఫైనల్ చేసినప్పటికీ కూడా సేఫ్ జోన్ లో ఉండటానికి కత్తి రీమేక్ ని ఎంచుకుని వినాయక్ డైరెక్షన్ లో ఖైదీ నంబర్ 150 వచ్చి ఇండస్ట్రీ హిట్ రికార్డ్ కొట్టాడు.

కానీ మెగాస్టార్ చిరు 150 వ సినిమాగా ఆల్ మోస్ట్ కన్ఫాం అయిన సినిమా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో అనుకున్న ఆటో జానీ మూవీ. ఈ సినిమా కథను చిరు రామ్ చరణ్ లు ఫైనల్ చేసి మెగాస్టార్150 మూవీ ఇదే అని కూడా అనౌన్స్ చేశారు.

కానీ ఆ ప్లేస్ లో రీమేక్ రాగా ఈ సినిమా నిరవధికంగా ఆగిపోయింది. 6 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. లేటెస్ట్ టాలీవుడ్ టాక్ ప్రకారం పూరీ జగన్నాథ్ మెగాస్టార్ ని కలవడం జరిగింది అని అంటున్నారు. మాటల్లో మాటగా ఈ స్క్రిప్ట్ గురించిన వివరాలు మెగాస్టార్ అడిగి తెలుసుకున్నారని అంటున్నారు.

పూరీ ఈ 6 ఏళ్ల లో స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులు చేశారని ఆ మార్పులు మెగాస్టార్ కి వినిపించగా చిరు కి అవన్నీ కూడా బాగా నచ్చాయని అంటున్నారు. దాంతో చిరు అప్ కమింగ్ మూవీస్ లైనప్ లో మళ్ళీ ఆటోజానీ చేరే అవకాశం ఎంతైనా ఉందనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. లూసిఫర్ రీమేక్ లేదా వేదళం రీమేక్ కన్నా కూడా ఒరిజినల్ కథ అయిన ఆటోజానీ బెటర్ అని విశ్లేషకుల భావన.

కానీ ఇప్పటికిప్పుడు కాకున్నా ఫ్యూచర్ ఇటు చిరు అటు పూరీ కమిట్ మెంట్స్ మీద ఈ సినిమా ఆధారపడి ఉంటుందని అంటున్నారు. పూరీ ఈ సినిమాను కుదిరితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ఆలోచనలో కూడా ఉన్నారని అంటున్నారు. సెట్ అయితే కనుక రచ్చ రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు… మరి ఫైనల్ గా సినిమా పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here