Home గాసిప్స్ 25 లోపే ఉండాలి!!…బాలయ్య షాకింగ్ డిసిషన్!

25 లోపే ఉండాలి!!…బాలయ్య షాకింగ్ డిసిషన్!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ కి 2019 ఇయర్ స్టార్టింగ్ అస్సలు కలిసి రాలేదు, ఎంతో ఆశ పడి అత్యంత భారీ ఎత్తున రూపొందించిన స్వర్గీయ ఎన్టీఆర్ గారి బయోపిక్ లోని రెండు పార్టులు కూడా టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా చేరాయు. పాజిటివ్ టాక్ తో కూడా రెండు సినిమా లు ఊహించని డిసాస్టర్లు అవ్వగా కొత్త సినిమా మొదలు పెట్టడానికి కొంత సమయం తీసుకున్నాడు బాలయ్య.

తనకి జై సింహా తో హిట్ ఇచ్చిన కే.ఎస్ రవికుమార్ డైరెక్షన్ రూలర్ సినిమాను మొదలు పెట్టగా రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ మంచి బజ్ నే సొంతం చేసుకుంది, అందులో టోనీ స్టార్క్ లుక్ అండ్ యాక్షన్ సీన్స్ – బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అవ్వగా మిగిలిన లుక్స్ పై…

సోషల్ మీడియా లో గట్టి ట్రోల్స్ పడ్డాయి. అయినా కమర్షియల్ మూవీ పరంగా మంచి బజ్ నే సొంతం చేసుకున్న సినిమా బిజినెస్ పరంగా కూడా ఎంతవరకు బిజినెస్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా నిర్మాతలకు బాలయ్య ఓ కండీషన్ పెట్టాడనే న్యూస్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.

సినిమా బిజినెస్ మంచి ఆఫర్స్ వచ్చినా కానీ ఓవరాల్ గా 25 కోట్ల లోపే ముగిసేలా చూడండి అంటూ బాలయ్య నిర్మాతలకు గట్టిగానే చెప్పినట్లు టాక్. ఎన్టీఆర్ బయోపిక్ కొని నష్టపోయిన వాళ్లకి ఈ సినిమా రైట్స్ ఎక్కువ శాతం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య మూవీస్ కి యావరేజ్ గా 30 నుండి 35 కోట్ల మధ్యలో బిజినెస్ జరుగుతుంది, ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ క్రేజ్ దృశ్యా భారీ బిజినెస్ జరిగి అది అందుకోలేక పోయింది, ఆ ఎఫెక్ట్ రూలర్ పై పడకూడదని బాలయ్య మంచి నిర్ణయమే తీసుకున్నారని చెప్పొచ్చు… మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అన్నది టోటల్ బిజినెస్ డీటైల్స్ వచ్చాక తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here