Home గాసిప్స్ సెన్సేషనల్ మూవీ రీమేక్ లో బాలయ్య!! 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే!!

సెన్సేషనల్ మూవీ రీమేక్ లో బాలయ్య!! 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే!!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ అంచనాలను అందుకోలేక భారీ నష్టాలను చవి చూసిన విషయం తెలిసిందే, ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న బాలయ్య తన కొత్త సినిమాలను ఒకటి తర్వాత ఒకటి మొదలు పెట్టడానికి సిద్ధం అయ్యాడు. ఇప్పటికే కే.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో సినిమా మొదలు అవ్వగా మరో సినిమా కమిట్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాడు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తున్న వార్తా..

ఆ కొత్త సినిమా డైరెక్ట్ కథ కాకుండా ఒక రీమేక్ కథ అని ఇండస్ట్రీ లో జోరు గా వార్తలు శిఖారు చేస్తున్నాయి. బాలీవుడ్ లో సైలెంట్ గా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించిన అమితాబ్ – తాప్సీ లు నటించిన పింక్ సినిమా తెలుగు రీమేక్ అని అంటున్నారు.

ఈ సినిమానే రీసెంట్ గా అజిత్ తమిళ్ లో రీమేక్ చేయగా తెలుగు లో కూడా డబ్ చేస్తారు అనుకున్నారు, కానీ తెలుగు లో కూడా ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన లో ఉండగా అమితాబ్ రోల్ ని కొంచం మాస్ గా చూపెట్టి బాలయ్య ని ఆ రోల్ కి తీసుకుంటే అద్బుతంగా ఉంటుందని భావిస్తున్నారట.

బాలయ్య తన కెరీర్ లో రీసెంట్ టైం లో పాత సినిమాలనే అదే పేరుతో మళ్ళీ చేసిన సినిమాలు పాండురంగడు మరియు శ్రీరామరాజ్యం… కానీ ఇవేవి రీమేక్ లు కాదనే చెప్పాలి. 2004 లో తమిళ్ బ్లాక్ బస్టర్ సామి ని తెలుగు లో లక్ష్మీ నరసింహా గా రీమేక్ చేశాడు బాలయ్య.

తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ రీమేక్ జోలికి వెళ్ళలేదు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు అన్నది ఇండస్ట్రీ లో టాక్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది త్వరలోనే తేలనుంది అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here