Home న్యూస్ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బాలయ్య…థియేటర్ దద్దరిల్లిపోయింది

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బాలయ్య…థియేటర్ దద్దరిల్లిపోయింది

0

     రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రీసెంట్ గా వచ్చేయగా అసలు సినిమాలు కావాడానికి కారణాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లియర్ గా చెప్పిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఆ మాటలని మరోసారి నిజం చేసి షాక్ ఇచ్చాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మొదలు అవ్వడమే బాలకృష్ణ కి స్పెషల్ థాంక్స్ తో…

మొదలు అవుతుంది, ఊహించని ఆ షాక్ కి థియేటర్స్ లో జై బాలయ్య పేరుతొ ఓ రేంజ్ లో మారుమ్రోగి పోయాయి అని చెప్పాలి. ముందుగా ఎన్టీఆర్ బయోపిక్ ని రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో నే తీయాలని బాలకృష్ణ భావించిన విషయం తెలిసిందే.

కానీ కథ లో మార్పులు లేకుండా నాకు తెలిసిన కథతో తీస్తానని వర్మ చెప్పడం లేదు నేను చెప్పిన విధంగానే తీయాలని బాలయ్య చెప్పడం తో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం తో ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని మొదలు పెట్టి షాక్ ఇచ్చాడు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా బాలయ్య కే అంకితం అంటూ స్టేట్ మెంట్ ఇవ్వగా అప్పుడే అందరు షాక్ అవ్వగా ఇప్పుడు సినిమా మొదట్లోనే బాలయ్య పేరు వేయడం తో ఫ్యాన్స్ ఇది పూర్తిగా బాలయ్య కోసమే వర్మ తీశాడు అనుకుంటున్నారు. ఏది ఏమైనా..

సినిమాలో చాలా సన్నివేశాలకు చప్పట్ల వర్షం విజిల్స్ వర్షం కురవగా బాలయ్య పేరు కి మాత్రం అల్టిమేట్ లెవల్ లో రెస్పాన్స్ దక్కింది అని చెప్పాలి. ఇక సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం అందరి లోను ఆసక్తి రేపుతున్న ప్రశ్న గా చెప్పుకోవాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here