Home న్యూస్ ఒక్క న్యూస్: టాలీవుడ్ మొత్తం షేక్ అయిపొయిందిగా!

ఒక్క న్యూస్: టాలీవుడ్ మొత్తం షేక్ అయిపొయిందిగా!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య తన ప్రతీ ఈవెంట్ కి టాలీవుడ్ లో ఉన్న ఇతర హీరోలను కలుపుకుంటూ పోతున్నాడు, భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పిలవగా ఆ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది.

తర్వాత మహర్షి ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ మరియు విజయ్ దేవరకొండ లను పిలవగా ఆ ఈవెంట్ కూడా అదిరి పోయింది, ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేసిన సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కీ ఎవరు గెస్ట్ గా వస్తారు అన్న ఆసక్తి మొదలు అవ్వగా…

అందరికీ షాక్ ఇస్తూ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు అని అఫీషియల్ గా అప్ డేట్ చేయగా రెండు రోజుల నుండి ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అప్పుడప్పుడు మెగాస్టార్ అలాగే మహేష్ బాబు ఇతర ఈవెంట్స్ లో కలుస్తూనే ఉన్నారు కానీ..

ఇప్పుడు మొదటి సారి గా ఇలా మెయిన్ ఈవెంట్ లో ఒకే వేదిక పై కలుస్తుండటం తో ఇటు మహేష్ అభిమానులు అటు మెగా అభిమానులు ఈవెంట్ కోసం ఇప్పుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చే న్యూ ఇయర్ లో…

జనవరి 5 న జరగబోతున్న విషయం తెలిసిందే,. సంక్రాంతి పోటి లో ఉన్న మెగా హీరో అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో ఈవెంట్ కి ఇప్పుడు స్పెషల్ గెస్ట్ లు ఎవరు అనేది కూడా ఆసక్తి గా మారింది, మొత్తం మీద ఈ సారి సంక్రాంతి పోరు మరింత జోరుగా ఉండబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here