ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్ బ్యానర్పై యు. సుహాష్ బాబు దర్శకత్వంలో ఈ ‘దారి’ సినిమా రూపొందుతోంది. నరేష్ మామిళ్ళ, మోహన్ ముత్తిరయిల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరామ్ (క్రేజీ అభి) ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ కాపీ తో సెన్సార్ కి సిద్దంగా ఉంది.
ఈ భూ ప్రపంచంలో ప్రతీ జీవికి ఏదోక సమస్య, ఆ సమస్య నుండి బయట పడటానికి మన ముందు ఉండేవి మూడే దారులు. అవి పారిపోవడం, దాక్కోవడం, లేదా ఎదురుతిరగడం. దారి ఏదైనా గమ్యం మాత్రం ఒక్కటే. ఈ కథలో కూడా అయిదుగురు వేరువేరు జీవితాలకు ఎదురైన ఒకే సమస్యను ఇతివృత్తంగా తీసుకొని ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా రూపొందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ఇతర అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.
నటీనటులు: పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరామ్ (క్రేజీ అభి)
సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: యు. సుహాష్ బాబు
బ్యానర్: ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్
నిర్మాతలు: నరేష్ మామిళ్ళ, మోహన్ ముత్తిరయిల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దమ్ము రాజా కిషన్
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు