బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న హీరోల్లో గోపీచంద్(Gopichand) ఒకరు, అలాగే టాలీవుడ్ డైరెక్టర్స్ లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా దుమ్ము లేపి తర్వాత వరుస ఫ్లాఫ్స్ తో ఫామ్ కోల్పోయిన డైరెక్టర్ శ్రీనువైట్ల(Sreenu Vaitla) ల కాంబినేషన్ లో ఇప్పుడు…
ఆడియన్స్ ముందుకు కొత్త సినిమా రాబోతుంది. ఈ ఇద్దరి కాంబోలో ఓ మంచి కమర్షియల్ మూవీ రూపొందబోతుందని అంటూ ఉండగా రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా మీద ఒక గాసిప్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.
ఆ వార్తా ప్రకారం ఈ సినిమా స్టోరీ పాయింట్ ముందు శ్రీనువైట్ల మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి వినిపించారని సమాచారం. ఆ కథ పాయింట్ నచ్చినప్పటికీ ప్రస్తుతం చేస్తున్న కమిట్ మెంట్స్ వలన ఓకే చెప్పని చిరు…..
రీసెంట్ గా భోలా శంకర్(Bholaa Shankar) ఫ్లాఫ్ తర్వాత కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టైంలో శ్రీనువైట్ల కథకి నో చెప్పారని అంటున్నారు… చాలా టైంగా ఈ కథని సిద్ధం చేసిన శ్రీను వైట్ల ఇప్పుడు ఇదే కథని గోపీచంద్ కి వినిపించడం గోపీచంద్ ఓకే చేయడంతో..
వీళ్ళ కాంబో లో మూవీ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు…మంచి హీరోయిజం, ఎలివేట్ సీన్స్ తో కమర్షియల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందబోతున్న ఈ సినిమాతో గోపీచంద్ మరియు శ్రీనువైట్ల ఇద్దరూ సూపర్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాలని అందరూ ఆశిస్తున్నారని చెప్పొచ్చు ఇప్పుడు.