Home గాసిప్స్ రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ అనుకుంటే…ఈ కాంబో సెట్ అయ్యిందేంటి!!

రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ అనుకుంటే…ఈ కాంబో సెట్ అయ్యిందేంటి!!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చేయబోయే సినిమా ఏంటి అనేది ఇప్పటికీ క్లారిటీ లేకుండా పోయింది, ఈ సినిమా లో రామ్ చరణ్ జాయిన్ అయ్యి ఆల్ మోస్ట్ 2 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు అప్ కమింగ్ మూవీ ని కమిట్ అవ్వలేదు రామ్ చరణ్, చాలా మంది డైరెక్టర్ ల పేర్లు వినిపించినా కానీ ఎవ్వరూ కూడా ఫైనల్ అవ్వలేదు ఇప్పటి వరకు.

ఇదే టైం లో రీసెంట్ గా ఒక వార్తా మాత్రం సాలిడ్ గా చక్కర్లు కొట్టింది, రామ్ చరణ్ ఇది వరకు చేసిన ధృవ సినిమా ఒరిజినల్ వర్షన్ తనీ ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవల్ లో ధృవ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు….

అన్న టాక్ చాలా స్ట్రాంగ్ గా చక్కర్లు కొట్టగా ఇప్పుడు ఆ టాక్ ప్లేస్ లో మరొ టాక్ గట్టిగా చక్కర్లు కొడుతుంది, రామ్ చరణ్ తో అనుకుంటే మోహన్ రాజా రీమేక్ లు బాగా హ్యాండిల్ చేస్తారు అన్న టాక్ ఉండటం తో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్….

మూవీస్ లో ముందు నుండి చేయాలి అని ఆశ పడుతున్న లూసిఫర్ రీమేక్ ని ఇప్పుడు మోహన్ రాజా చేతిలో పెట్టారు అన్న టాక్ వినిపిస్తుంది. అందుకు మోహన్ రాజా కూడా ఒప్పుకున్నారని, కథ ని తన స్టైల్ లో మార్చి మెగాస్టార్ ని మెప్పించి ఛాన్స్ ను సొంతం చేసుకుంటారని ఇప్పుడు టాక్ గట్టిగానే వినిపిస్తుంది.

రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా అనుకుంటే అనుకోకుండా ఏకంగా మెగాస్టార్ తో సినిమా ఆఫర్ రావడం తో ఇప్పుడు లూసిఫర్ రీమేక్ ని అనుకున్న రేంజ్ కన్నా బాగా తీసి రామ్ చరణ్ తో తర్వాత పాన్ ఇండియా సినిమా చేయాలి అని మోహన్ రాజా అనుకుంటున్నారట… మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here