Home న్యూస్ సడెన్ గా హౌస్ ఫుల్ బోర్డ్స్…ఏం జరుగుతుంది అస్సలు!

సడెన్ గా హౌస్ ఫుల్ బోర్డ్స్…ఏం జరుగుతుంది అస్సలు!

0

    నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ మహానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా మిగిలి పోయిన విషయం తెలిసిందే, వీకెండ్ కే సినిమా పరిస్థితి చాలా కష్టంగా మారి పోగా వర్కింగ్ డేస్ లో మరింత దయనీయంగా సినిమా కలెక్షన్స్ ఉండటం తో సినిమా ఫైనల్ రన్ లో ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది అందరికీ ఆల్ మోస్ట్ కన్ఫాం అయింది.

కానీ సడెన్ గా సినిమా కి 5 వ రోజు నుండి ఆంధ్రా రీజన్ లో కొన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి, అవి కలెక్షన్స్ రూపం లో రాలేదని అంటుండగా ఇలా సడెన్ గా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడటం తో వీకెండ్ లో పడని హౌస్ ఫుల్ బోర్డ్స్ వర్కింగ్ డేస్ లో పడటం ఏంటి…

అని అందరు అనుకోవడం మొదలు పెట్టగా సోషల్ మీడియా లో ఒక వాట్సప్ మెసేజ్ చక్కర్లు కొడుతుంది, అది అన్ని జిల్లాలకు ఫార్వార్డ్ చేస్తున్నారని అంటున్నారు. ఆ పోస్ట్ ప్రకారం TDP పార్టీ వారు సినిమా ను తప్పని సరిగా తమ పార్టీ కార్యకర్తలు చూడాలని…

అందుకు గాను సగం డబ్బులను పార్టీ నే బరిస్తుందని చెప్పి పోస్ట్ ని రిలీజ్ చేశారని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఆ ఎఫెక్ట్ వలెనే సినిమా కి కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయని అంటున్నారు. కానీ అవి కలెక్షన్స్ రూపం లో ఇప్పటి వరకు మారలేదని మరో వర్గం చెబుతున్నారు.

సినిమా రిజల్ట్ వచ్చాక ఇలాంటి పనుల వల్ల ఏమి ఇదిగేది లేదని అందరికి తెలిసిన విషయమే.. చరిత్ర సృష్టించిన మనిషి జీవిత చరిత్ర ఆదరంగా తెరకెక్కిన సినిమా కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోలేక చారిత్రిక నష్టాలను మిగిలించిన సినిమాల్లో ఒకటిగా నిలవడం భాదకరమే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here