Home న్యూస్ లాస్ట్ ఇయర్ ఫ్లాఫ్ మూవీ తో 2020 లో ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న సూర్య!!

లాస్ట్ ఇయర్ ఫ్లాఫ్ మూవీ తో 2020 లో ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న సూర్య!!

0

కోలివుడ్ స్టార్ హీరో సూర్య కి తమిళ్ తో పాటు తెలుగు లో కూడా సాలిడ్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే, రీసెంట్ టైం లో సరైన హిట్ లేక క్రేజ్ ఇక్కడ తగ్గింది కానీ సూర్య కి కరెక్ట్ సినిమా పడితే మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి. ఇక రీసెంట్ గా సూర్య సినిమా లకు ప్రస్తుతం పరిస్థితులకు పెర్ఫెక్ట్ గా సింక్..

అవ్వడం తో నేషనల్ వైడ్ గా సూర్య పేరు మారు మ్రోగిపోతుంది… సూర్య 2011 లో చేసిన సెవెంత్ సెన్స్ సినిమా లో చైనా నుండి ఇక్కడ ఒక వైరస్ ఇండియా ని ముప్పుతిప్పలు పెట్టినట్లు చూపెట్టగా ఇప్పుడు చైనా నుండే వచ్చిన కరోనా ఇండియా తో పాటు…

టోటల్ ప్రపంచాన్నే వణికిస్తు ముప్పు తిప్పలు పెడుతుంది, ఇది ఒక రిఫెరెన్స్ కాగా ఇప్పుడు మరో రిఫెరెన్స్ కూడా జరిగింది, లాస్ట్ ఇయర్ సూర్య నటించిన బందోబస్తు సినిమా తమిళ్ లో హిట్ అవ్వగా తెలుగు లో మాత్రం భారీ ఫ్లాఫ్ అయింది, కానీ ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ప్రస్తుతం పంటలను నాశనం చేస్తున్న మిడతల దండు ఇప్పుడు సౌత్ లో పంటలను నాశనం చేస్తున్న విషయం తెలిసిందే, ఇదే కాన్సెప్ట్ ని సూర్య బందోబస్తు సినిమా లో వాడాడు. దాంతో అప్పుడు పెద్దగా పట్టించుకోని ఈ సినిమాను ఇప్పుడు ఖాళీ గా ఉన్న టైం లో తెగ చూస్తున్నారని తెలుస్తుంది.

ఇది గమనించిన కొందరు ఈ రెండు సినిమాలు నిజం అవ్వడం తో… సూర్య చేసిన 24 సినిమా కాన్సెప్ట్ కూడా నిజం అయితే బాగుణ్ణు అని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మీద సూర్య 2 సినిమా లకు ప్రస్తుత పరిస్థితులు బాగా సింక్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఆ 2 సినిమాల్లో వాటిని అరికట్టినట్లు ఇప్పుడు కూడా ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ప్రస్తుత పరిస్థితులు సెట్ అయితే బాగుణ్ణు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here