Home గాసిప్స్ బయటపడుతున్న నిజాలు…ఆ సీన్స్ పై హీరో ఎంత చెప్పినా బోయపాటి వినలేదట!

బయటపడుతున్న నిజాలు…ఆ సీన్స్ పై హీరో ఎంత చెప్పినా బోయపాటి వినలేదట!

0

     మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఇప్పుడు థియేటర్స్ నుండి వెళ్లి పోయిన తర్వాత మళ్ళీ వార్తల్లో నిలుస్తుంది, డానికి కారణం దర్శకుడు మరియు నిర్మాతల మధ్య జరుగుతున్న మాటల యుద్దమే అన్న విషయం అందరికీ తెలిసిందే, ఓపెన్ గా కాకున్నా ఇండస్ట్రీ వర్గాల నుండి ఈ గొడవ కి సంభందించిన వార్తలు ఇండస్ట్రీ లో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా సినిమా నష్టాల ను అందరం కలిసి బరిద్దామని, నష్టపోయిన వాళ్ళ కి ఎంతో కొంత తిరిగి ఇద్దామని హీరో నిర్మాతల నిర్ణయానికి దర్శకుడు అడ్డు చెప్పడం తో గొడవ పెద్దది అవ్వగా పాత విషయాలను ఇప్పుడు తవ్వుతున్నారని తెలుస్తుంది.

అందులో భాగంగా సినిమా లో కొన్ని సీన్స్ ఓవర్ ద టాప్ గా ఉన్నాయని, ఆడియన్స్ కి నచ్చక పోవచ్చు అని హీరో నిర్మాత దర్శకుడి కి ఎంత చెప్పినా ఇది వరకు నా సినిమాల్లో ఇలాంటివి ఉన్నాయని అప్పుడు ఏం ఇబ్బంది కలగలేదు అని ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని…

బోయపాటి చెప్పాడట… ఆ సీన్స్ మరీ ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, తలలు నరికితే గద్దలు క్యాచ్ చేయడం, పాము విలన్ ని కరిచే సీన్స్ అని అంటున్నారు, ఇవి బాలేవని ఇంకా ఏవైనా ట్రై చేద్దామని తనకి ఇవి సూట్ కావని చరణ్ పదే పదే చెప్పాడట. కానీ..

బోయపాటి వినలేదని.. ఇప్పుడు ఆ సీన్స్ కి థియేటర్స్ లో విజిల్స్ కి బదులు నవ్వులపాలు అవ్వాల్సి వచ్చిందని మాటల యుద్ధం లో ఒకరినొకరు అనుకున్నారని సమాచారం. ఫైనల్ గా ఈ గొడవ ని ఆపడానికి మెగా పెద్దలు రంగం లోకి దిగారని తెలుస్తుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here