Home గాసిప్స్ ఆగిపోయిన వినాయక్…సీనయ్య పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఆగిపోయిన వినాయక్…సీనయ్య పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

0

మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ని హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా అనుకుని షూటింగ్ కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే. సీనయ్య పేరు తో రూపొందిన ఈ సినిమా కి సుమారు 10 కోట్ల రేంజ్ బడ్జెట్ కూడా అయింది అన్న వార్తలు టాలీవుడ్ లో రీసెంట్ గా చక్కర్లు కొట్టాయి. దాంతో సినిమా ఓవర్ బడ్జెట్ అవుతుంది అనుకుని నిర్మాత దిల్ రాజు సినిమా ను…

ఆపేశారని కూడా వార్తలు వచ్చాయి…. ఇది ఒక వర్షన్ కాగా ఇప్పుడు సినిమా డైరెక్టర్ అయిన నరసింహా రావ్ కి అసలు సినిమా ఆగిపోయినట్లు కూడా తెలియదు అంటూ లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథ కి వినాయక్ గారు అయితే సెట్ అవుతారని…

ఆయన్ని అప్రోచ్ అయ్యామని, ముందు ఒప్పుకోక పోయినా తర్వాత ఓకే అన్నారని, తర్వాత దిల్ రాజు గారు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు రాగా వినాయక్ బర్త్ డే టైం లో సినిమా పోస్టర్స్ ని రిలీజ్ చేశామని చెప్పుకొచ్చారు డైరెక్టర్ నరసింహ రావ్… ఇక సినిమా ఆగిపోయిన విషయం పై మాట్లాడుతూ…

ఆగిపోయిందని నాకు ఇప్పటి వరకు తెలియదని, నేను స్క్రిప్ట్ లో ఇంకా మరిన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో సినిమా ఆగిపోయింది అన్న విషయం పై డౌట్ అలాగే కొనసాగుతుండగా మరో పక్క వినాయక్ కూడా ఈ సినిమాను పక్కకు పెట్టేసి డైరెక్టర్ గా కొత్త సినిమాలను కమిట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.

అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తో లూసిఫర్ రీమేక్ కథ ని మార్చే పనిలో ఉండగా అది ఓకే అయితే ఈ సినిమా ను కంప్లీట్ గా దూరం పెట్టేసినట్లే అని చెప్పొచ్చు. మరో పక్క డైరెక్టర్ మాత్రం ఈ పాండమిక్ తర్వాత తిరిగి షూటింగ్ మొదలు అవుతుందని ఆశిస్తున్నా అంటూ చెప్పుకోచ్చరట. ఇక దిల్ రాజు ఫైనల్ నిర్ణయం ఏమి అవుతుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here