Home న్యూస్ ముగ్గురు హిట్లు కొట్టి ఏళ్ళు అవుతుంది….ఇప్పుడు వీళ్ళలో హిట్ ఎవరు కొడతారో!!

ముగ్గురు హిట్లు కొట్టి ఏళ్ళు అవుతుంది….ఇప్పుడు వీళ్ళలో హిట్ ఎవరు కొడతారో!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ ఎఫెక్ట్ మొదలు అయింది అనుకుంటే జాతిరత్నాలు సినిమా మాత్రం అన్ సీజన్ అని కూడా చూడకుండా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా మరో పక్క ఇప్పుడు అప్ కమింగ్ వీక్ లో మూడు సినిమాలు పోటి కి సిద్దం అవుతున్నాయి… ఆశ్యర్యకరంగా మూడు సినిమాల హీరోలు కూడా రీసెంట్ టైం లో హిట్ కి దూరం అవ్వడంతో ఇప్పుడు…

ఆశలన్నీ కూడా ఈ సినిమాల మీదే పెట్టుకున్నారు…ముందుగా ఎప్పటి నుండో హిట్స్ కి దూరం అయిన మంచు విష్ణు ఏకంగా 50 కోట్ల రేంజ్ బడ్జెట్ తో మోసగాళ్ళు సినిమా తో ఆడియన్స్ ముందుకు రాబోతుండగా, ఆల్ మోస్ట్ హిట్ కొట్టి 9 ఏళ్ళు అవుతున్న మరో హీరో ఆది సాయి కుమార్ కూడా…

తన లేటెస్ట్ మూవీ శశి మీదే ఆశలు పెట్టుకున్నాడు. సినిమా పాటలు మంచి సక్సెస్ అవ్వడం తో సినిమా పై ఎంతో కొంత క్రేజ్ ఏర్పడింది. ఇక వీళ్ళతో పోల్చితే కొత్త వాడే అయినా కార్తికేయ… బాక్స్ ఆఫీస్ దగ్గర RX100 మూవీ తో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చినా కూడా…

తర్వాత మూడేళ్ళు అవుతున్న మరో హిట్ ను సొంతం చేసుకోలేక పోయాడు. కానీ ఈ సారి అపజయం అంటే తెలియని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో చేస్తున్న చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న నేపధ్యంలో ఈ సారి హిట్ కొట్టి జోరు చూపే అవకాశం ఎంతైనా ఉందని అందరూ ఆశిస్తున్నారు అని చెప్పాలి.

మొత్తం మీద ముగ్గురికి కూడా కెరీర్ మళ్ళీ గాడిలో పడాలి అంటే హిట్ కొట్టడం ఎంతైనా అవసరం అని చెప్పాలి. మరి ఇలాంటి టైం లో ఈ ముగ్గురు హీరోలలో ఎవరు హిట్ కొడతారు… బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు కంబ్యాక్ ఇస్తారు అన్నది ఆసక్తిగా మారింది అని చెప్పాలి. అండ్ ఫైనల్ గా జాతిరత్నాలు జోరు ముందు నిలుస్తారా లేదా అన్నది కూడా ఆసక్తి కరం అని చెప్పొచ్చు.

Jathi Ratnalu 5 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here