Home గాసిప్స్ ఫస్ట్ ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్…పాన్ ఇండియా దద్దరిల్లడం ఖాయం!!

ఫస్ట్ ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్…పాన్ ఇండియా దద్దరిల్లడం ఖాయం!!

0

ఇండియా లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్టు లో చోటు దక్కించుకున్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు, కేవలం ఒకే ఒక్క సినిమా తో ఇండియా వైడ్ గా సెన్సేషనల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్ తో సినిమా పడాలి అని కోరుకొని వారు లేరనే చెప్పాలి. KGF సినిమా తో సైలెంట్ గా ఇండియా వైడ్ సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు…

KGF చాప్టర్ 2 సినిమా తో ఫుల్ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే, ఈ ఇయర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఆశగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ చేయబోయే 2 సినిమా లు కన్ఫాం అయ్యాయి.

అవి రెండు కూడా టాలీవుడ్ హీరోలతో నే అవ్వడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. నేడు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు అవ్వడం తో టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ అండ్ డి వివి ఎంటర్ టైన్ మెంట్స్ వారు స్పెషల్ బర్త్ డే విషెస్ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

మైత్రి మూవీ మేకర్స్ తో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఆల్ రెడీ కన్ఫాం అయ్యిన విషయం తెలిసిందే, ఇక కొత్తగా డివివి బ్యానర్ లో కూడా ఒక సినిమా కమిట్ అయ్యాడు ప్రశాంత్ నీల్. త్వరలో డివివి బ్యానర్ లో రామ్ చరణ్, ప్రభాస్ లు సినిమాలు కమిట్ అయ్యారు, వారిలో ఇప్పుడు ప్రభాస్ తో…

ప్రశాంత్ నీల్ ఉండబోతుందని సమాచారం, ఇవి తెలుగు కన్నడ భాషల్లో ఏక కాలం లో అలాగే ఇతర భాషల్లో డబ్ అయ్యి పాన్ ఇండియా లెవల్ లో రూపొందే సినిమా లు అని అంటున్నారు. దాంతో ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అటు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ తో మూవీ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here