Home గాసిప్స్ 300 కోట్ల సినిమా డైరెక్టర్ తో గోపీచంద్ పాన్ ఇండియా మూవీ!!

300 కోట్ల సినిమా డైరెక్టర్ తో గోపీచంద్ పాన్ ఇండియా మూవీ!!

0

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతుంది… అప్పుడెప్పుడో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ ఆ తర్వాత మళ్ళీ సీటీమార్ తో పర్వాలేదు అనిపించినా కూడా తర్వాత చేసిన సినిమాలు అంచనాలను అందుకోలేక పోయాయి. ఇలాంటి టైంలో ఇప్పుడు…

భీమా(Bheemaa Movie) అలాగే శ్రీనువైట్ల తో కొత్త సినిమా చేస్తున్న గోపీచంద్ ఆ సినిమాల తర్వాత మరో భారీ సినిమాను చేయబోతున్నాడు ఇప్పుడు…రెండేళ్ళ క్రితం 300 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) తో పాన్ ఇండియా మూవీ రాదే శ్యామ్(Radhe Shyam) సినిమా తీసిన…

రాధాకృష్ణ డైరెక్షన్ గోపీచంద్ తో సినిమా ఉండబోతుందని సమాచారం. గోపీచంద్ తో చేసిన జిల్ మూవీతోనే డైరెక్టర్ గా అడుగు పెట్టిన రాధాకృష్ణ ఆ తర్వాత సినిమా రాదే శ్యామ్ చేయడానికి చాలా టైం తీసుకోగా తీసుకున్న రాధాకృష్ణ ఆ సినిమా డిసాస్టర్ రిజల్ట్ ఇంపాక్ట్ గట్టిగా పడటంతో కొత్త సినిమా ఎవరితో చేస్తాడో అనుకున్నా…

చివరికి గోపీచంద్ తో కథ చెప్పి ఒప్పించి ఇప్పుడు సినిమాను త్వరలో మొదలు పెట్టబోతున్నాడట. ఈ సినిమా కాన్సెప్ట్ సివిల్ వార్ నేపధ్యంలో ఉంటుందని, చాలా వరకు షూటింగ్ ఫారన్ లోనే జరుగుతుందని అంటున్నారు…. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాతో రాధాకృష్ణ ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడు గోపీచంద్ కి ఎలాంటి విజయాన్ని సొంతం అయ్యేలా చేస్తాడో చూడాలి…

అలాగే సినిమా జానర్ దృశ్యా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించ బోతున్నట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఆసక్తిగా మారగా ఈ లోపు గోపీచంద్ భీమా మరియు శ్రీనువైట్ల సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కితే ఈ సినిమాతో తన స్టార్ డం మరింత పెరిగే అవకాశం ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here