Home గాసిప్స్ 7 ఏళ్ల క్రితం మూవీ…ఇప్పుడు క్రేజీ మూవీ కి పోటి!!

7 ఏళ్ల క్రితం మూవీ…ఇప్పుడు క్రేజీ మూవీ కి పోటి!!

0

   బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే రోజున ఒకటికి మించి సినిమాలు రిలీజ్ అవ్వడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది, కానీ కావాలని ఒక సినిమా వస్తున్న డేట్ కి మరో సినిమా ను అనౌన్స్ చేయడం అన్నది ఓపెన్ పోటి ని డిక్లేర్ చేయడమే అవుతుంది. ఇప్పుడు అలాంటిదే చేయడానికి సిద్ధం అవుతున్నాడు పబ్లిసిటీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ… ఆల్ మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయినా అప్పుడప్పుడు తన మ్యాజిక్ ని చూపించే వర్మ….

అడపాదడపా ఎదో ఒక సినిమాతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. లేటెస్ట్ గా ఇప్పుడు తన డైరెక్షన్ లో ఏడేళ్ళ క్రితం మొదలు పెట్టి కంప్లీట్ చేసి రిలీజ్ కి నోచుకోని సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. ఆ సినిమా నే పట్టపగలు…

యాంగ్రీ మాన్ రాజశేఖర్ హీరోగా సాక్షీ దీక్షిత్ రాజశేఖర్ కూతురి రోల్ లో నటించిన ఈ సినిమా 2014 లో మొదలు పెట్టి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా కొన్ని కారణాల వలన సినిమా రిలీజ్ ను ఆపేశారు. అది అలానే కొనసాగి అసలు ఈ సినిమా ఒకటి ఉందని జనాలు మర్చిపోయేలా చేసింది.

కానీ ఇప్పుడు సడెన్ గా ఈ సినిమా ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలియదు కానీ సడెన్ గా సినిమాను ఇప్పుడు ఏప్రిల్ 16 న నాయచైతన్య సాయి పల్లవిల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ లవ్ స్టొరీ కి పోటి గా రిలీజ్ చేయాలనీ సిద్ధం చేస్తున్నాడట. అలా ఇప్పుడు సినిమా ప్రచారం కూడా జరుగుతూ ఉండగా….

ఎంతోకొంత మందికి సినిమా రీచ్ అయ్యి ఎంతో కొంత కలెక్షన్స్ ని సాధించే ఛాన్స్ ఉంటుందని ప్లాన్. ఇటు హీరోగా రాజశేఖర్ కూడా ఫామ్ కోల్పోయి చాలా కాలం అవుతూ ఉండటం తో ఎంతవరకు ఈ సినిమా జనాలను థియేటర్స్ కి రప్పిస్తుందో చూడాలి. అసలు పోటిలో ఈ సినిమాను జనాలు పట్టించుకుంటారో లేదో అన్నది కూడా డౌటే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here