Home గాసిప్స్ 3 హీరోలు నో చెబితే కళ్యాణ్ రామ్ సై అన్నాడు….45 కోట్ల బింబిసర బ్యాక్ స్టొరీ...

3 హీరోలు నో చెబితే కళ్యాణ్ రామ్ సై అన్నాడు….45 కోట్ల బింబిసర బ్యాక్ స్టొరీ ఇదే!

0

నందమూరి కళ్యాణ్ రామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అడపాదడపా హిట్స్ కొడుతున్నా కానీ స్టేబుల్ మార్కెట్ ని సొంతం చేసుకోలేదు, కొన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి బెడసి కొట్టాయి. ఇలాంటి టైం లో కెరీర్ లోనే ఇప్పుడు బిగ్గెస్ట్ రిస్క్ చేయడానికి సిద్ధం అయ్యాడు కళ్యాణ్ రామ్, కొత్త దర్శకుడు మల్లాడి వేణు డైరెక్షన్ లో రూపొందుతున్న కళ్యాణ్ రామ్ కొత్త సినిమా బింబిసర సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని…

రీసెంట్ గా రిలీజ్ చేయగా సినిమా ఫస్ట్ లుక్ తోనే మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది, ఇక ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా ఏకంగా 45 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో నిర్మాణం కాబోతూ ఉండగా ఈ సినిమా వెనక బ్యాక్ స్టొరీ 5 ఏళ్లుగా సాగుతుందని…

లేటెస్ట్ గా టాలీవుడ్ లో వార్తలు శిఖారు, డైరెక్టర్ వేణు ఈ సినిమా కథ ని 5 ఏళ్ల క్రితమే ప్రిపేర్ చేయగా ముగ్గురు హీరోల దగ్గరకి ఈ సినిమా కథని తీసుకెళ్ళాడని కానీ వాళ్ళ నుండి ఇప్పుడు చివరగా కళ్యాణ్ రామ్ దగ్గరకు ఈ సినిమా కథ వచ్చి ఆగిందని అంటున్నారు.

ముందుగా మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అల్లు శిరీష్ దగ్గరకు ఈ సినిమా 5 ఏళ్ల క్రితమే వెళ్ళగా గీతా ఆర్ట్స్ లో భారీ మైతలాజికల్ మూవీ చేస్తున్నాని అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు, కానీ తర్వాత ఏమైందో తెలియదు ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టేశారు. తర్వాత ఇదే కథ నితిన్ కి అలాగే రామ్ దగ్గరకి…

కూడా వెళ్లిందని కానీ తమకి ఈ కథ సెట్ అవ్వదు అంటూ ఈ ఇద్దరూ కూడా పక్కకు తప్పుకున్నారట. అలా ముగ్గురు దగ్గరకి వెళ్ళిన తర్వాత చివరగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ దగ్గర కి ఈ కథ వెళ్ళడం కొన్ని మార్పుల తర్వాత ఓకే అవ్వడం ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడం జరిగింది. మరి భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు కళ్యాణ్ రామ్ కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here