Home గాసిప్స్ సర్కారు వారి పాట లో ధృవ విలన్…భారీ రెమ్యునరేషన్ ఆఫర్!!

సర్కారు వారి పాట లో ధృవ విలన్…భారీ రెమ్యునరేషన్ ఆఫర్!!

0

మూడు వరుస విజయాలతో కెరీర్ బెస్ట్ స్పీడ్ మీదున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే డిఫెరెంట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే, బ్యాంగ్ లో భారీగా లోన్స్ తీసుకున్న విలన్ ని హీరో ఎలా ఇండియా కి రప్పించి లోన్ కట్టించాడు అన్న స్టొరీ పాయింట్ తో రూపొందబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీ లెవల్ లో ఉన్నాయి.

కాగా ఈ సినిమాలో టోటల్ కాస్ట్ అండ్ క్రూ ఇంకా కన్ఫాం కాలేదు కానీ కీలక పాత్రలకు వేట కొనసాగుతుందని సమాచారం, హీరోయిన్ గా చాలా మందినే అనుకున్నా కీర్తి సురేష్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయిందని తెలుస్తుంది. ఇక సినిమాలో విలన్ రోల్ కోసం….

చాలామందినే ట్రై చేస్తున్నారు కానీ ఎవ్వరూ ఇంకా ఫైనల్ కాలేదు. ముందు కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ని ట్రై చేయగా రెస్పాన్స్ రాలేదు, తర్వాత ఉపేంద్ర ని అనుకున్నారు కానీ ఎందుకనో అక్కడ నుండి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదని సమాచారం. ఇక ఇప్పుడు కోలివుడ్ నుండి విలన్ ని ట్రై చేస్తున్నారు.

తని ఒరువన్ సినిమా తో స్టైలిష్ విలన్ గా మెప్పించిన అరవింద్ స్వామి, అదే పాత్ర ని మరింత స్టైలిష్ గా తెలుగు లో కూడా చేశాడు, ధృవ లో రామ్ చరణ్ కి పోటిగా నటించి మెప్పించాడు, భారీ రెమ్యునరేషన్ ని కూడా తీసుకున్నాడు కానీ మళ్ళీ ఎందుకనో తెలుగు లో విలన్ రోల్స్ చేయలేదు.

రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పడం వలన ఆఫర్స్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు అలాగే తిరిగి వెళ్ళే వాళ్ళని సమాచారం, ఇప్పుడు సర్కారు వారి పాట కోసం 6 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని టాక్ ఇండస్ట్రీ లో ఉంది. ఇది నిజం అయితే విలన్ రోల్ కి బిగ్గెస్ట్ రేటు అనే చెప్పాలి. కానీ ఇంకా అరవింద్ స్వామీ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here