Home న్యూస్ 15 కోట్ల బడ్జెట్…400 స్క్రీన్స్ లో రిలీజ్…ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్!

15 కోట్ల బడ్జెట్…400 స్క్రీన్స్ లో రిలీజ్…ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్!

0

ఇండియా లో 8 నెలల భారీ గ్యాప్ తర్వాత థియేటర్స్ అన్నీ కూడా దాదాపుగా రీ ఓపెన్ అవ్వగా ఇంకా కొన్ని చోట్ల ఓపెన్ అవ్వాల్సి ఉంది, ఇక ఓపెన్ అయిన థియేటర్స్ లో ఇప్పటి వరకు ఆల్ రెడీ రిలీజ్ అయిన సినిమాలనే రీ రిలీజ్ చేస్తున్నా పెద్దగా అయితే రెస్పాన్స్ రాలేదు… దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో హాలీవుడ్ మూవీ టెనెట్ ఇండియా లో రిలీజ్ ను కన్ఫాం చేసుకుని పర్వాలేదు అనిపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా…

బాలీవుడ్ వాళ్ళు ఎవ్వరూ కూడా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ధైర్యం చేయని టైం లో క్రేజీ హీరోయిన్ కియరా అద్వాని మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ ఇందు కి జవానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ 11 న థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది.

సినిమా మొత్తం మీద 400 వరకు స్క్రీన్స్ లో ఇండియా వైడ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా పర్వాలేదు టైం పాస్ మూవీ గా చూడొచ్చు అంటూ టాక్ కూడా లభించింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ ని సినిమా కలిగించ లేక పోయింది అని చెప్పాలి…

సినిమా మొత్తం మీద మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 25 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మాములు రోజుల్లో అయినా సినిమా 75 లక్షల నుండి 1 కోటి రేంజ్ కలెక్షన్స్ ని అందుకునేది కానీ ఇప్పుడు ఆల్ మోస్ట్ 3 వ వంతు కన్నా తక్కువ కలెక్షన్స్ వస్తున్నా కారణంగా ఈ సినిమా కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించింది అని అంటున్నారు.

సినిమాను మొత్తం మీద 15 కోట్ల బడ్జెట్ లో రూపొందించగా ప్రమోషన్ కోసమే ఏకంగా 3 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఆ లెక్కన చూసుకుంటే సినిమా డిసాస్టరస్ అనిపించే స్టార్ట్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా కోటి వరకు కలెక్షన్స్ ని అందుకుంటే గొప్పే అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here