Home న్యూస్ ఎన్టీఆర్ కథానాయకుడు 3వ రోజు స్టేటస్…అసలు ఏం జరుగుతుంది సామి!

ఎన్టీఆర్ కథానాయకుడు 3వ రోజు స్టేటస్…అసలు ఏం జరుగుతుంది సామి!

0

  నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్ల మూడో కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా తొలి రెండు రోజుల్లో టోటల్ గా 12.2 కోట్ల లోపు షేర్ మాత్రమె సాధించి షాక్ ఇచ్చే కలెక్షన్స్ తో అసలు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. టాక్ బాగున్నా కలెక్షన్స్ లేక థియేటర్స్ మొత్తం వెల వెల బోతున్నాయి.

ఇప్పటికే ఉన్న థియేటర్స్ లో చాలా వరకు రెండో రోజు రిలీజ్ అయిన పేట సినిమా కి వెల్ల గా మూడో రోజు రిలీజ్ అయిన వినయ విధేయ రామ సినిమా కోసం మరిన్ని థియేటర్స్ తొలగించారు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పరిస్థితి ఏంటో అర్ధమ్ అవ్వడం లేదు.

మూడో రోజు టోటల్ రెండు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు 250 కి పైగా మాత్రమె థియేటర్స్ ఉండటం విచారకరం. దాంతో మూడో రోజు ఓపెనింగ్స్ ని బట్టి 60 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు, మరి నైట్ షోల సమయానికి ఏమైనా గ్రోత్ ఉంటుందో ఉండదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here