Home గాసిప్స్ అక్షరాలా 250 కోట్లు…2022 లో ఆల్ ఇండియా లెవల్ లో భీభత్సం!

అక్షరాలా 250 కోట్లు…2022 లో ఆల్ ఇండియా లెవల్ లో భీభత్సం!

0

టెంపర్ నుండి నాస్ స్టాప్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆల్ మోస్ట్ రెండేళ్ళుగా ఆర్ ఆర్ ఆర్ కే పరిమితం అయ్యాడు, మరో ఏడాది కాలం కూడా ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించడం ఖాయంగా కనిపిస్తుండగా ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మొదటి క్వార్టర్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది.

India's Biggest Birthday Trend Record Belongs To #HappyBirthdayNTR

ఇక ఎన్టీఆర్ తాలుకూ షూటింగ్ ఈ ఏడాది మొదలు అయితే ఇయర్ ఎండ్ కి కంప్లీట్ అవుతుంది, ఇక త్రివిక్రమ్ తో సినిమా వచ్చే ఏడాది మొదట్లో మొదలు అవుతుందని సమచారం. సినిమా ను ముందు వచ్చే ఇయర్ సమ్మర్ కి అనుకున్నా ఇప్పుడు లెక్కలు మారి…

వచ్చే ఇయర్ ఎండ్ లేదా 2022 లో రావచ్చు అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా మూవీ అత్యంత భారీ ఎత్తున రూపొందబోతుంది అన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఆ న్యూస్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ ఏకంగా…

250 కోట్ల రేంజ్ లో ఉంటుందని, కన్నడ తెలుగు భాషల్లో ఏక కాలం లో రూపొందే ఈ సినిమా మిగిలిన భాషల్లో డబ్ అవుతుందని అంటున్నారు, కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే ఈ పాటికే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అయిపోయి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ ఉండాల్సింది, కానీ పరిస్థితులు మారడం తో అన్నీ డిలే అవ్వగా…

ఈ సినిమా కూడా 2021 ఎండ్ టైం లో మొదలు అవుతుందని 2022 లో ఆడియన్స్ ముందుకు ఆల్ ఇండియా లెవల్ లో భీభత్సం సృష్టించడానికి వచ్చే అవకాశం ఎంతైనా ఉందీ అని అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఇవేవి కాదు ముందు ఆర్ ఆర్ ఆర్ అప్ డేట్ వస్తే చాలు, తర్వాత ఈ సినిమా ల గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నారు, యూనిట్ మాత్రం మరింత టైం తీసుకుని అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here