Home న్యూస్ అమ్మింది 22.8 కోట్లకి…3 రోజుల్లో వచ్చింది ఇది….పాపం శర్వానంద్

అమ్మింది 22.8 కోట్లకి…3 రోజుల్లో వచ్చింది ఇది….పాపం శర్వానంద్

0

  గత ఏడాది రెండు హిట్లు ఒక ఫ్లాఫ్ తో మంచి జోరు కొనసాగించిన యంగ్ హీరో శర్వానంద్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు పడి పడి లేచే మనసు అంటూ కొత్త సినిమా తో వచ్చేశాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 5 సినిమాలలో ఒకటిగా నిలిచి పోటిలో గెలుస్తుంది అనుకున్న ఈ సినిమా మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ మాత్రం షాకింగ్ గా ఉన్నాయి. సినిమాను టోటల్ గా 22.8 కోట్లకు అమ్మారు.

దాంతో బాక్స్ అఫీస్ దగ్గర మినిమమ్ 23.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి 3 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 4.3 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలిపి మరో 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా,

మొదటి వీకెండ్ మొత్తం మీద షేర్ 5 కోట్ల మార్క్ ని అందుకుంది. అంటే బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 18 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమే అవ్వడం బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ ఖాతాలో ఫ్లాఫ్ పడటం పక్కగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here