Home న్యూస్ 5 డిసాస్టర్స్ తర్వాత 25 కోట్లు ఏంటి సామి…అరాచకం ఇది!!

5 డిసాస్టర్స్ తర్వాత 25 కోట్లు ఏంటి సామి…అరాచకం ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా భారీగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే…. 2017 టైం లో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న శర్వానంద్ తర్వాత వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటికి మించి ఒకటి ఫ్లాఫ్స్ ను తన ఖాతాలో వేసుకుంటూ మార్కెట్ పరంగా దెబ్బ పడేలా చేసుకున్నారు. కానీ శర్వానంద్ మూవీస్ కి ఎప్పటి కప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో….

బిజినెస్ సాలిడ్ గా జరుగుతూ ఉండటం వలనే శర్వానంద్ మూవీస్ కి భారీ బడ్జెట్ లు సొంతం అవుతూ ఉండటం విశేషం. ఇక రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మహా సముద్రం సినిమా తో భారీ డిసాస్టర్ ను మరోసారి సొంతం చేసుకున్న శర్వానంద్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు…..

రష్మికతో కలిసి ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా తో ఈ నెల 25న ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా తో మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని నమ్మకంగా ఉండగా సినిమా ఇప్పుడు నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా దుమ్ము లేపిందట.

మొత్తం మీద సినిమా డిజిటల్, శాటిలైట్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ తో పాటు మ్యూజిక్ రైట్స్ తో కలిపి సినిమా కి ఏకంగా 25 కోట్ల భారీ రేటుని సొంతం చేసుకుందని సమాచారం. బాక్ టు బాక్ 5 బాక్స్ ఆఫీస్ డిసాస్టర్ మూవీస్ తర్వాత ఈ రేంజ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరగడం మాస్ అనే చెప్పాలి. చాలా వరకు బడ్జెట్ ను….

ఈ నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే రికవరీ అయిందని సమాచారం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా కి డీసెంట్ బిజినెస్ జరుగుతుందని సమాచారం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 25 న ఈ సినిమా శర్వానంద్ కి 5 డిసాస్టర్ మూవీస్ తర్వాత మంచి కంబ్యాక్ గా నిలుస్తుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here