Home గాసిప్స్ కెరీర్ టర్నింగ్ మూవీ అనుకున్నాడు…ఇప్పుడు మొత్తానికే సినిమాను ఆపేశాడు!

కెరీర్ టర్నింగ్ మూవీ అనుకున్నాడు…ఇప్పుడు మొత్తానికే సినిమాను ఆపేశాడు!

0

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఛత్రపతి (Chatrapathi) సినిమా మీద బెల్లంకొండ భారీ ఆశలు పెట్టుకున్నాడు కానీ ఈ సినిమా హిందీలో అట్టర్ డిసాస్టర్ గా నిలిచి హీరో ఆశల మీద నీళ్ళు పోసింది. దాంతో ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ స్ట్రైట్ తెలుగు మూవీనే సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఛత్రపతి మూవీతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్(Bellam Konda Srinivas) ఒప్పుకున్న మరో పెద్ద సినిమా…

స్టూవర్ట్ పురం దొంగ…. ఈ సినిమా మీద భారీ నమ్మకం పెట్టుకున్న బెల్లంకొండ ఛత్రపతి తర్వాత ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకేక్కించాలి అనుకున్నాడు… కానీ రవితేజ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageshwara Rao) మెయిన్ స్టొరీ పాయింట్ ఈ సినిమా కథ పాయింట్ కొంచం సిమిలర్ గా…

ఉందని తెలుసుకుని ఈ కథని కొంచం మార్చాలి అనుకున్నారు… కానీ టైగర్ నాగేశ్వరరావు రిజల్ట్ కూడా ఈ సినిమా మీద నిర్ణయం మార్చుకునేలా చేసిందని అంటున్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ కథని టోటల్ గా పక్కకు పెట్టేసి కొత్త కథలను హీరో ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కథ మీద ఆసక్తితో కొంత టైం క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా…

రిలీజ్ చేశారు… అప్పుడే సినిమా మీద అంచనాలు పెరిగినా కానీ అప్పటికే రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనౌన్స్ మెంట్ జరగడంతో ఈ సినిమా పట్టాలు ఎక్కలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ గా ఆగిపోయినట్లే అని అంటున్నారు…. మరి ఈ సినిమా ప్లేస్ లో ఏ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో టైగర్ నాయడు సినిమాతో త్వరలో రచ్చ చేయనున్నాడు. మరి ఆ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here