Home న్యూస్ Tv 9 కి చివాట్లు పెడుతున్న సోషల్ మీడియా!

Tv 9 కి చివాట్లు పెడుతున్న సోషల్ మీడియా!

0

  అత్యుత్సాహం అన్ని వేళలా పనిచేయదు అంటారు పెద్దలు, నిజా నిజాలు తెలియకుండా చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు, కానీ తెలిసిన వెంటనే వాటిని సరిదిద్దుకుంటారు. రీసెంట్ గా తెలుగు లో అన్ని విషయాలను కవర్ చేసే టి వి 9 ఇప్పుడు విమర్శలకు చాన్స్ ఇచ్చింది.

ప్రస్తుతం చాలా సెన్సిటివ్ అంశం అయిన ఇండియా పాకిస్తాన్ ల మధ్య నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రతీ ఒక్కరు ఎదో కామెంట్ చేస్తుండటం తో విషయం మరింత సీరియస్ అయ్యే అవకాశం ఉందని తెలిసి కూడా సోషల్ మీడియా లో ఎవరే ఫేక్ అకౌంట్ తో…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరుతో “మా జవాన్ ని వదలకుంటే యుద్దమే” అంటూ చేసిన కామెంట్ నిజమో కాదో తెలుసుకోకుండా ఇక పాకిస్థాన్ పై యుద్దమే అంటూ ప్రధాన మంత్రి తెలిపారు అంటూ ఏకంగా గంటన్నర కార్యక్రమం నడిపారు.

తీరా చివర్లో అది ఫేక్ అకౌంట్ నుండి వేసిన ట్వీట్ అని తెలుసుకుని, ఇది ఫేక్ అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్, భయపడానికి అవసరం లేదు అంటూ కార్యక్రమం ముగించారు, దాంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఫేక్ ఎదో నిజం ఎదో తెలియకుండా…

ఇలాంటి డిబేట్లు పెట్టి జనాల్లో మరింత టెన్షన్ ని పెంచి మీరు టి.ఆర్.పి లు పెంచుకుంటున్నారు అంటూ బాగానే రెచ్చిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here