Home న్యూస్ 190 కోట్ల సినిమా షాకింగ్ తెలుగు బిజినెస్…థియేటర్స్ కౌంట్!

190 కోట్ల సినిమా షాకింగ్ తెలుగు బిజినెస్…థియేటర్స్ కౌంట్!

0

     కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విశ్వాసం బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరిలో భారీ గా రిలీజ్ అయ్యి పోటిలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన పేట ఉన్నప్పటికీ తమిళ్ లో అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించి తమిళనాడు కి గాను ఇండస్ట్రీ రికార్డు లను సృష్టించి దుమ్ము లేపగా టోటల్ గా 50 రోజులకు గాను ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద…

190 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుని దుమ్ము లేపగా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కి సిద్ధం అయింది, తెలుగు లో సినిమా బిజినెస్ ఒకింత షాక్ కి గురి చేస్తుంది అని చెప్పాలి. కోలివుడ్ లో ఎంత స్టార్ హీరో అయినా సినిమా టోటల్ గా 190 కోట్ల రేంజ్ లో…

కలెక్షన్స్ ని అందుకున్నా కానీ టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో అజిత్ కి పెద్దగా మార్కెట్ లేక పోవడం తో ఈ సినిమాను మొత్తంగా 2.6 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు తెలుస్తుంది. దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి…

3.5 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అజిత్ విశ్వాసం సినిమాను భారీ గా నే రిలీజ్ చేస్తున్నారు. పోటిలో కళ్యాణ్ రామ్ 118 సినిమా ఉన్నప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న విశ్వాసం సినిమా మొత్తంగా…

450 వరకు థియేటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కి సిద్ధం అవుతుంది, తమిళ్ లో సొంతం చేసుకున్న రేంజ్ టాక్ ని ఇక్కడ సొంతం చేసుకుంటే కచ్చితంగా సినిమా ఇక్కడ కచ్చితంగా ఈ టార్గెట్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు జోరు చూపుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here