Home గాసిప్స్ ఉదయ్ కిరణ్ లాస్ట్ సినిమా డైరెక్ట్ OTT రిలీజ్??

ఉదయ్ కిరణ్ లాస్ట్ సినిమా డైరెక్ట్ OTT రిలీజ్??

0

టాలీవుడ్ అప్ కమింగ్ హీరోలలో ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డులు సృష్టించిన హీరో ఉదయ్ కిరణ్, చిత్రం తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో సినిమా సినిమా కి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి టాలీవుడ్ బెస్ట్ ఎవర్ అప్ కమింగ్ హీరో ఎంట్రీ అనిపించుకున్న ఉదయ్ కిరణ్… కొన్నేళ్ళ కిందట మానసిక స్థితి బాలేక స్వర్గస్తుడైన విషయం అందరికీ తెలిసిందే.

హీరోగా కొన్నేళ్ళు ఒక వెలుగు వెలిగి సడెన్ గా డౌన్ ఫాల్ అవ్వడం, తర్వాత తిరిగి తేరుకోలేక పోవడం తో ఎంతో మానసిక క్షోభ అనుభవించాడు ఉదయ్ కిరణ్. తన చివరి రోజుల్లో కూడా కొన్ని సినిమాలు చేయగా అవి రిలీజ్ కి నోచుకోలేదు.

వాటిలో చివరి సినిమా అయిన చిత్రం చెప్పిన కథ ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత నిర్మాత థియేటర్లో రిలీజ్ చేయాలని ట్రై చేసి మళ్ళీ ఊరుకున్నాడు. దాంతో ఫ్యాన్స్ చివరి సారి తనని సినిమాలో చూడాలి అని ఎదురు చూసి చూసి ఆగిపోయారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృశ్యా థియేటర్ రిలీజ్ కన్నా కూడా…

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ బెటర్ అని భావించిన యూనిట్ ఎవరైనా OTT యాప్స్ తమ దగ్గరికి వస్తే ఈ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయలాని భావిస్తున్నారట. కొన్ని చిన్న యాప్స్ వస్తున్నప్పటికీ వాటి రీచ్ చాలా తక్కువ ఉంటుందని ఆగుతున్నారట. ఈ న్యూస్ సోషల్ మీడియా లో తెలిసి సినిమా ఎలాగైనా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

ఉదయ్ కిరణ్ లాగే రీసెంట్ గా మానసిక ఒత్తిడి వలన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా పరమావధించిన విషయం తెలిసిందే. ఆల్ మోస్ట్ ఇద్దరూ ఇండస్ట్రీ బయట నుండి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన వాళ్ళే… సుశాంత్ నటించిన చివరి సినిమాలు కూడా ఫ్యాన్స్ థియేటర్స్ లో చూసి తనకి చివరి నివాళి ఇవ్వాలి అని నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here