ఫైనల్ కౌంట్ క్లియర్ గా తెలియకపోయినా ఓవరాల్ గా 24 గంటలు ముగిసే సమయానికి టోటల్ గా 4 లక్షల 50 వేల రేంజ్ లో ట్వీట్స్ టోటల్ గా పోల్ అయినట్లు సమాచారం. మరో రెండేళ్ల వరకు ఎన్టీఆర్ నుండి సినిమా ఉండదు కాబట్టి అభిమానులు అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు.
ఎన్టీఆర్-రామ్ చరణ్ ల కలయికలో టాలీవుడ్ నంబర్1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో అత్యంత భారీ ఎత్తున తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటుండగా సినిమాను 2020 సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తారనే టాక్ ఉంది. ఆ సినిమా తో ఇండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు.