Home గాసిప్స్ 1100 కెపాసిటీ….90 నిమిషాల్లో టికెట్స్ ఔట్…మెగాస్టార్ క్రేజ్ పవర్

1100 కెపాసిటీ….90 నిమిషాల్లో టికెట్స్ ఔట్…మెగాస్టార్ క్రేజ్ పవర్

1

     టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి మరి కొన్ని రోజుల సమయం మాత్రమె ఉంది, సినిమా కి ఇక్కడ ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో పక్క రాష్ట్రాలలో కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంది, ముఖ్యంగా తెలుగు సినిమాలను ఎక్కువగా ఆదరించే కన్నడ లో సినిమా పై ఎక్కువ ఆసక్తి నెలకొంది. సినిమా లో కిచ్చ సుదీప్ నటించడం తో…

అక్కడ సినిమాను కన్నడ లో డబ్ చేసి రిలీజ్ కూడా చేస్తుండటం తో క్రేజ్ మరింత పెరిగి పోయింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని సెలెక్టెడ్ ప్లేసు లలో మొదలు అవ్వగా టెర్రిఫిక్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న సినిమా ఇప్పుడు మరో సంచలనం సృష్టించింది.

ఇండియా లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ గా కర్ణాటకలో ఉన్న ఊర్వశి థియేటర్ నిలుస్తుంది, ఆ థియేటర్ కెపాసిటీ 1100…. ఆ థియేటర్ లో సినిమా ప్రదర్శితం అయితేనే గొప్ప అనుకునే వారు కూడా ఉంటారు. ఇక ఆ చోట మన సైరా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రోజు మొదలు అయ్యాయి.

ఉదయం 3 గంటల 5 నిమిషాల స్పెషల్ షో తో అక్కడ ఓపెన్ కాబోతుంది సైరా సినిమా.. కాగా ఆ స్పెషల్ షో అడ్వాన్స్ బుకింగ్స్ ని రీసెంట్ గా మొదలు పెట్టగా కేవలం 90 నిమిషాల సమయం లోనే టోటల్ టికెట్స్ అన్నీ అయిపోయాయట. దాంతో సినిమా పై అక్కడ క్రేజ్ చూసి అంతా షాక్ అవుతున్నారు.

రీసెంట్ టైం లో అక్కడ నాన్ బాహుబలి మూవీస్ లో అరవింద సమేత 8 గంటల్లో 5 వేల టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వగా సాహో సినిమా 10 గంటల్లో 6 వేల టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక ఇప్పుడు సైరా కూడా అక్కడ సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here