Home న్యూస్ చైతూ పక్కా అంటున్నాడు…కాచుకోండి ఇక!

చైతూ పక్కా అంటున్నాడు…కాచుకోండి ఇక!

0

  అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీస్ లో రారండోయ్ వేడుక చూద్దాం మాత్రమె ప్రేక్షకులను అలరించింది, ఆ సినిమా తర్వాత చేసిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ ఫలితాన్ని మాత్రం అందుకోలేక పోయాయి. ఇలాంటి సమయం లో తన హోప్స్ అన్నీ ఇప్పుడు సమంత తో కలిసి చేస్తున్న మజిలి సినిమా పైనే పెట్టుకున్నాడు నాగ చైతన్య. కాగా ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కాగా సినిమా సంగీత దర్శకుడు గోపి సుందర్ కొన్ని కారణాల వలన సినిమా నుండి తప్పుకోగా ఇంకా రీ రికార్డింగ్ పూర్తీ అవ్వాల్సి ఉండటం తో సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుంది అన్న టాక్ వినిపించినా ఇప్పుడు తమన్ రీ రికార్డింగ్ ఇవ్వడానికి ఒప్పుకోవడం తో అన్నీ సర్దుకున్నాయి.

సినిమా అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు వస్తుందని, ఈ సినిమా తో కచ్చితంగా అభిమానుల అంచనాలను అందుకుంటానని నాగ చైతన్యా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. మరి ఫ్యాన్స్ కూడా సిద్ధంగా ఉంటే ఏప్రిల్ 5 న కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here