Home న్యూస్ ఇటు 250 అటు 450…అల్లుడు ఇక కుమ్ముడే!

ఇటు 250 అటు 450…అల్లుడు ఇక కుమ్ముడే!

0

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా అను ఎమాన్యుఎల్ హీరోయిన్ గా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు. మంచి అంచనాల నడుమ మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ను భారీ గానే రిలీజ్ చేస్తున్నారు.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను నాగ చైతన్య కెరీర్ లో నే రికార్డ్ లెవల్ లో రిలీజ్ చేస్తుండటం విశేషం…నైజాం లో ఏకంగా 250 వరకు థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఆంధ్రాలో 250 వరకు థియేటర్స్ లో అలాగే సీడెడ్ లో 200 వరకు థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

అంటే దాదాపు 700  వరకు థియేటర్స్ లో శైలజా రెడ్డి అల్లుడు అత్యంత భారీ ఎత్తున రిలీజ్ ని సొంతం చేసుకోబోతుంది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధిస్తుందో అని అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here