ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను నాగ చైతన్య కెరీర్ లో నే రికార్డ్ లెవల్ లో రిలీజ్ చేస్తుండటం విశేషం…నైజాం లో ఏకంగా 250 వరకు థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఆంధ్రాలో 250 వరకు థియేటర్స్ లో అలాగే సీడెడ్ లో 200 వరకు థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
అంటే దాదాపు 700 వరకు థియేటర్స్ లో శైలజా రెడ్డి అల్లుడు అత్యంత భారీ ఎత్తున రిలీజ్ ని సొంతం చేసుకోబోతుంది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధిస్తుందో అని అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.