Home న్యూస్ నైజాం నవాబ్…చరిత్రకెక్కిన 30 కోట్ల భీభత్సం!

నైజాం నవాబ్…చరిత్రకెక్కిన 30 కోట్ల భీభత్సం!

0

  సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా అయిన మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ లో రిలీజ్ అయ్యి అద్బుతమైన కలెక్షన్స్ తో 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఆల్ టైం రికార్డులతో దుమ్ము లేపిన విషయం తెలిసిందే, కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు నైజాం ఏరియాలో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని చారిత్రిక రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

బాహుబలి సిరీస్ తప్పితే ఇక్కడ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా 29 కోట్ల షేర్ మార్క్ ని అందుకోలేదు, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రంగస్థలం ఓవర్ ఫ్లో కలెక్షన్స్ తో కలిపి 28.9 కోట్ల షేర్ ని అందుకుందని నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన మహర్షి సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 30 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి దూసుకు పోతుంది, లాంగ్ రన్ లో 31 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ మార్క్ ని అందుకుని నైజాం నైజాం నవాబ్ గా మహేష్ నిలిచాడు. మరి ఈ రికార్డ్ ను రానున్న రోజుల్లో అందుకునే సినిమా ఏది అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here