Home గాసిప్స్ 2 ఏళ్ల క్రితం మోస్ట్ ట్రోల్స్ ఫేస్ చేసిన సినిమా కి సీక్వెల్…..బడ్జెట్ ఎన్ని కోట్లో...

2 ఏళ్ల క్రితం మోస్ట్ ట్రోల్స్ ఫేస్ చేసిన సినిమా కి సీక్వెల్…..బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా!

0

ప్రతీ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాలకే సీక్వెల్స్ లాంటివి తీయాలా…ఫ్లాఫ్ అయినా సినిమాలకు సీక్వెల్స్ లాంటివి తీయకూడదో ఏమో అనుకుంటున్నారో ఏమో కన్నడలో ఉపేంద్ర నటించిన కబ్జా అట్టర్ ఫ్లాఫ్ అయినా ఆ సినిమా సీక్వెల్ ను తీయబోతున్నారు. ఇక తమిళ్ లో రెండేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి…

ఆ ఇయర్ లోనే బిగ్గెస్ట్ ట్రోల్స్ ని ఫేస్ చేసిన సినిమా కి కూడా ఇప్పుడు సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేయబోతున్నారట. వివరాల్లోకి వెళితే శరవణన్ స్టోర్స్ అధినేత శరవణన్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ది లెజెండ్… ఆల్ మోస్ట్ 45 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం అవ్వగా…

రెండేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి హీరో పెర్ఫార్మెన్స్ అండ్ లుక్స్ మీద భారీగా నెగటివ్ గా ట్రోల్స్ ను ఫేస్ చేసింది….సినిమా రిలీజ్ తర్వాత ఆ ట్రోల్స్ ఇంపాక్ట్ అండ్ సినిమా టాక్ కూడా మిక్సుడ్ గా ఉండటంతో ఏ దశలో కూడా బడ్జెట్ కి న్యాయం చేయలేక పోయిన సినిమా 7 కోట్ల లోపే గ్రాస్ తో రన్ ని కంప్లీట్ చేసుకుంది…

అలాంటి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక ఆ సినిమాను మర్చిపోయి కొత్త సినిమా ఏమైనా ప్లాన్ చేసుకుంటారు ఎవ్వరైనా…కానీ శరవణన్ మాత్రం ది లెజెండ్ మూవీ కి సీక్వెల్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారట… ధనుష్, శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన దురై సెంథిల్ కుమార్ ని భారీ రెమ్యునరేషన్ ని ఇస్తూ ఇప్పుడు…

ది లెజెండ్ మూవీ కి సీక్వెల్ ను త్వరలో తీయబోతున్నారట. ఈ సారి బడ్జెట్ ఆల్ మోస్ట్ 60 కోట్ల దాకా ఉంటుందని కోలివుడ్ లో టాక్ వినిపిస్తుంది….మొదటి సినిమానే 10% కూడా రిటర్న్స్ తీసుకురాలేక పోయింది, అలాంటిది ఇప్పుడు రెండో సినిమా కి ఈ రేంజ్ బడ్జెట్ అండ్ డిసాస్టర్ మూవీ కి సీక్వెల్ అంటే ఎలా ఉంటుందో అని అందరూ అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here