Home న్యూస్ అప్పుడు ఫ్యాన్స్ గొడవ చేసిన వినలేదు…కానీ ఇప్పుడు ఒక్కరోజు ఇచ్చారు!!

అప్పుడు ఫ్యాన్స్ గొడవ చేసిన వినలేదు…కానీ ఇప్పుడు ఒక్కరోజు ఇచ్చారు!!

0

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఎక్కువ శాతం ఫ్యామిలీ మూవీస్ నే చేస్తూ వచ్చిన విక్టరీ వెంకటేష్ తమిళ్ లో ధనుష్ చేసిన అసురన్ సినిమాను తెలుగు లో నారప్ప పేరుతో రీమేక్ చేయగా లాస్ట్ ఇయర్ అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే సమ్మర్ టైం లో థియేటర్స్ లో రిలీజ్ చేయాలి అనుకున్నా కానీ సెకెండ్ వేవ్ వలన కుదరలేదు. ఆ టైం లో ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితులలో ఈ సినిమాను థియేటర్స్ లోనే…

రిలీజ్ చేయాలని డిమాండ్ చేసినా మేకర్స్ కొన్ని కారణాల వలన డిజిటల్ లోనే రిలీజ్ చేయగా వెంకీ మాస్ రాంపేజ్ ని థియేటర్స్ లో మిస్ అవ్వడంతో ఫ్యాన్స్ భారీగా హార్ట్ అయ్యారు. అప్పుడు ఫ్యాన్స్ ఎంత గొడవ చేసిన వినని మేకర్స్… 

ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత ఫ్యాన్స్ కోసం సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 13న విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా నారప్ప సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేయగా ఇక్కడ కేవలం ఒక్క రోజు మాత్రమే సినిమాను…

థియేటర్స్ లో ఉంచుతామని చెప్పడంతో ఆ ఒక్క రోజు ఫ్యాన్స్ అలాగే వెంకటేష్ ని మాస్ అవతారంలో చూడాలి అనుకున్న ఆడియన్స్ థియేటర్స్ లో నారప్పని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. మరి ఆడియన్స్ ఎంతవరకు థియేటర్స్ కి వస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here