Home న్యూస్ నేను ఇలా శికరాగ్రానికి చేరుకోవడానికి కారణం ఆ డిసాస్టర్ సినిమానె అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన...

నేను ఇలా శికరాగ్రానికి చేరుకోవడానికి కారణం ఆ డిసాస్టర్ సినిమానె అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ దాదాపు 15 ఏళ్ల క్రితం సింహాద్రి సమయంతో పోల్చుతున్నారు విశ్లేషకులు. అప్పట్లో ఈ రేంజ్ లో మీడియా హడావుడి లేకున్నా ఎన్టీఆర్ కి విపరీతమైన క్రేజ్ ఉండేదని అంటున్నారు. కానీ మళ్ళీ ఆ రేంజ్ క్రేజ్ కోసం ఎన్టీఆర్ కి 15 ఏళ్ల కాలం పట్టింది అని చెప్పొచ్చు. కాగా ఈ క్రేజ్ కి కారణం ఒక్క సినిమానే అని జనతాగ్యారేజ్ ఘనవిజయం తర్వాత రీసెంట్ గా సన్నిహితులతో ఎన్టీఆర్ చెప్పాడట.

ఆ సినిమా ఏంటో తెలుసా 2014 లో వచ్చిన రభస సినిమానే. ఆ సినిమా చూసిన అభిమానులు ఇలాంటి సినిమా ఎందుకు చేశావ్ అన్నా అంటూ వేదనకి గురి అయ్యారట. దాంతో ఎన్టీఆర్ తనని తాను ప్రశ్నించుకుని మాస్ సినిమాలే చేయాలా లేక ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయాలా అన్న డిసిషన్ లో రెండో ప్రయత్నాన్ని నమ్ముకుని టెంపర్-నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్, జైలవకుశ లాంటి ప్రయోగాత్మక సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అయ్యాడు.

ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ 4 సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లో అతి ముఖ్యమైన సమయంలో వచ్చిన అతిపెద్ద ప్రయోగాలు, అవి కానీ విఫలం అయితే ఎన్టీఆర్ ఇక పూర్తిగా డౌన్ అయిపోయే స్టేజ్ లో చేసిన అతిపెద్ద సాహసం ఇప్పుడు ఎన్టీఆర్ ని తిరిగి టాలీవుడ్ టాప్ హీరోల్లో క్రేజీస్టార్ గా మార్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here