కాగా ఈ ఈవెంట్ టాలీవుడ్ అతిరధమహా రథులతో పాటు టోటల్ నందమూరి ఫ్యామిలీ కూడా ఒకే వేదిక పై కనిపించ బోతుందని సమాచారం. దాంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది అని చెప్పాలి. మెగా, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి.
అందరు హీరోలు హాజరు అవుతూ ఉంటారు కానీ గత కొన్నేళ్ళలో ఎప్పుడు కూడా నందమూరి ఫ్యామిలీ ఒకే వేదిక పై కనిపించింది లేదు. దాంతో ఒక్కసారి గా అందరు ఒకే వేదిక పై కనిపించబోతున్నారు అన్న వార్తా అందరిలోనూ ఈ ఈవెంట్ పై ఆసక్తి పెరిగేలా చేసింది. నందమూరి ఫ్యామిలీ తో పాటు, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు, మోహన్ బాబు, జమున, గీతాంజలి మరియు మరింత మంది ప్రత్యెక అతిధులు ఈ ఈవెంట్ లో పాల్గొన బోతున్నారట.