ఇక సర్కార్ తర్వాత విజయ్ అప్ కమింగ్ మూవీ కంఫామ్ అయింది. తనకి తెరీ మరియు మెర్సల్ సినిమాలతో రెండు అద్బుతమైన విజయాలను ఇచ్చిన రాజా రాణి దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో తన తదుపరి సినిమాను త్వరలోనే మొదలు పెట్ట బోతున్నాడట విజయ్.
కాగా వచ్చే ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 25 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు దీపావళి కి వచ్చి 200 కోట్ల సినిమాలతో బాక్ టు బాక్ భీభత్సం సృష్టించిన విజయ్ వచ్చే ఏడాది మరోసారి దుమ్ము దుమారం చేయడం ఖాయమని ఇప్పటి నుండే అంచనాలు పెంచుకుంటున్నారు.