Home గాసిప్స్ ఆల్ మోస్ట్ అఫీషియల్…వినాయక్ ఔట్…ఈ డైరెక్టర్ ఇన్!

ఆల్ మోస్ట్ అఫీషియల్…వినాయక్ ఔట్…ఈ డైరెక్టర్ ఇన్!

0

మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడేళ్ళ క్రితం ఖైదీ నంబర్ 150 తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వగా కంబ్యాక్ ఇవ్వడం రీమేక్ తో ఇచ్చిన మెగాస్టార్ తర్వాత కూడా రీమేక్ లను ఎక్కువగా ఒప్పుకుంటూ వస్తున్నారు. కత్తి రీమేక్ గా ఖైదీ నంబర్ 150 తెరకెక్కగా తర్వాత లూసిఫర్ రీమేక్ ని కమిట్ అయిన చిరు తర్వాత వేదాలం రీమేక్ ని కూడా ఓకే చేసి ఒకటి తర్వాత ఒకటి తెరకెక్కిస్తున్నారు.

మధ్యలో సైరా మరియు ఆచార్య ఒరిజినల్ కథలతోనే తెరకెక్కగా ఆచార్య తర్వాత చేయబోతున్న ఈ రెండు రీమేక్ లు ఒకటి తర్వాత ఒకటి ఆడియన్స్ ముందుకు రానున్నాయి. కాగా ముందుగా ఏ రీమేక్ ని మొదలు పెట్టాలో చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్న చిరు ఎట్టకేలకు…

రీసెంట్ గా వేదాలం రీమేక్ ని మొదలు పెట్టేశారు, మెహర్ రమేష్ కలకత్తాలో వేదాలం రీమేక్ షూటింగ్ మొదలు పెట్టగా ఇప్పుడు లూసిఫర్ రీమేక్ డైరెక్టర్ కూడా ఆల్ మోస్ట్ అఫీషియల్ గా కన్ఫాం అయ్యారు. ముందు సుజిత్ తో అనుకున్న రీమేక్ ను తర్వాత డైరెక్టర్ మార్చి వివి వినాయక్ తో…

కన్ఫాం చేయగా మళ్ళీ కథ తెలుగు మార్పులు చేర్పులు సరిగ్గా సెట్ కాక పోవడంతో వినాయక్ ప్లేస్ లో ఇప్పుడు రామ్ చరణ్ ధృవ ఒరిజినల్ వర్షన్ తనీ ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ లో తెలుగు లూసిఫర్ రీమేక్ ని చేయబోతున్నట్లు ఈ మద్య వార్తలు రాగా ఇప్పుడు అవి ఆల్ మోస్ట్ అఫీషియల్ గానే కన్ఫాం అయ్యాయి అని చెప్పాలి. రీసెంట్ గా మోహన్ రాజా…

మెగాస్టార్ ని కలవడం మార్పులు చేర్పులు చెప్పడం అవి చిరు కి నచ్చడం జరిగిందని సమాచారం. దాంతో ఇక లూసిఫర్ రీమేక్ ఇప్పుడు మోహన్ రాజా చేతిలో ఉందని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా ను కూడా మొదలు పెట్టాలని చూస్తున్నారట మెగాస్టార్. 2021 లో ఎట్టి పరిస్థితులలో మెగాస్టార్ నుండి 2 సినిమాలు రావడం ఖాయమని అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here