Home న్యూస్ అమ్మింది 18 కోట్లకి….ఫస్ట్ వీకెండ్ లో వచ్చింది ఇది..పాపం బెల్లంకొండ

అమ్మింది 18 కోట్లకి….ఫస్ట్ వీకెండ్ లో వచ్చింది ఇది..పాపం బెల్లంకొండ

0

   నాలుగేళ్ళు గా విజయం కోసం చకోర పక్షి లా ఎదురు చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ కవచం. కాజల్ మరియు మెహ్రీన్ లు జంటగా నటించిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమాని రెండు రాష్ట్రాల్లో 16 కోట్లకు టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్లకి అమ్మగా సినిమా టోటల్ గా 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.

కాగా సినిమా మొదటి రోజు 1.9 కోట్ల షేర్ ని, రెండో రోజు 1 కోటి షేర్ ని మూడో రోజు 50 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ గా 3 రోజుల్లో 3.4 కోట్ల షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ గ్రాస్ 3 రోజులకి 6 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది.

దాంతో సినిమా ఇక తేరుకోవడం కష్టమే అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు. దాంతో 4 ఏళ్ళు గా క్లీన్ హిట్ కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్న బెల్లంకొండ కి ఈ సారి కూడా నిరాశనే మిగిలించింది కవచం సినిమా. మరి వర్కింగ్ డేస్ లో సినిమా పుంజుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here