Home గాసిప్స్ రజినీ నిర్ణయం….6 నెలలు ఆగాల్సిందే!

రజినీ నిర్ణయం….6 నెలలు ఆగాల్సిందే!

0

కరోనా ఎఫెక్ట్ వలన అందరి పనులు వరుస గా పోస్ట్ పోనులు అవుతుండగా ఎక్కువగా ఇబ్బంది పడ్డది మాత్రం సినీ ఇండస్ట్రీ అనే చెప్పాలి. సినిమాలు రిలీజ్ లు ఆగి ఇప్పటికే 5 వ నెల కావస్తుండగా, షూటింగ్స్ కి తిరిగి పర్మీషన్ వచ్చినా కానీ స్టార్స్ ఇంకా షూటింగ్స్ కి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టం చూపడం లేదు. దాంతో మరింతగా ఇండస్ట్రీ నష్టపోతున్నప్పటికీ పరిస్థితుల వలన ఇది జరగక తప్పని పరిస్థితిగా మారింది.

ఇక ఇప్పుడు ఈ ఇంపాక్ట్ సూపర్ స్టార్ రజినీ కి కూడా గట్టిగానే ఇంపాక్ట్ చూపింది, రీసెంట్ గా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సూపర్ స్టార్ రజినీ ప్రతీ ఏడాది కూడా కొత్త సినిమాను ఒకటి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

పేట, దర్బార్ సినిమాలు రెండూ ఒకటి తర్వాత ఒకటి రాగా ఇప్పుడు మరో సంక్రాంతికి అన్నాటల్లై సినిమాను రిలీజ్ చేయాలి అని చాలా కష్టపడ్డారు కానీ కరోనా తమిళనాడు లో తీవ్ర రూపం దాల్చడంతో సినిమాను సంక్రాంతి రేసు నుండి తప్పించగా… ఇప్పటికీ కూడా అక్కడ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోవడంతో…

ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. మన వల్ల ఎవ్వరూ ఇబ్బందులు పడకూడదని, సినిమా షూటింగ్ అన్నీ సద్దుకున్నాకే చేద్దామని నిర్మాతలకు డైరెక్టర్ శివ కి రజినీ చెప్పారట. ఈ ఇయర్ ఎండ్ వరకు షూటింగ్స్ వద్దు అని, అన్నీ సద్దుకున్నాక వచ్చే ఏడాది మొదట్లో ఎంత కుదిరితే అంత త్వరగా షూట్ చేసి సినిమాను సమ్మర్ రేసులో నిలుపుదామని మాట ఇచ్చారట.

దాంతో నిర్మాతలు ఒకటి రెండు నెలల్లో మొదలు పెడదాం అనుకున్నా ఇప్పుడు రజినీ మాటలకు వాళ్ళు కొద్దిగా షాక్ అయినా అందరి మేలు కోరే ఈ నిర్ణయం తీసుకోవడం తో సరే అన్నారట. దాంతో బిగ్ స్టార్ మూవీస్ లో అఫీషియల్ గా 6 నెలలు పోస్ట్ పోన్ అయిన సినిమాగా ఈ సినిమా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here