Home న్యూస్ 4 ఏరియాలు….44.64 కోట్లు…...అల్లు అర్జున్ దుమ్ము లేపుతున్నాడు గా!!

4 ఏరియాలు….44.64 కోట్లు….[క్లాస్ లో మాస్]..అల్లు అర్జున్ దుమ్ము లేపుతున్నాడు గా!!

0

     స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా సమయమే అయింది… 2018 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు నా పేరు సూర్య తో వచ్చిన అల్లు అర్జున్ ఆ సినిమా ఫ్లాఫ్ తో కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు త్రివిక్రమ్ తో కలిసి అల వైకుంఠ పురం లో సినిమా తో రాబోతున్నాడు. ఆల్ మోస్ట్ ఎదానిన్నర కి పైగా గ్యాప్ రాగా తనకి జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి…

మంచి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో ఈ సారి హాట్రిక్ కి ప్లాన్ చేస్తున్నాడు. అల వైకుంఠ పురంలో సినిమా రిలీజ్ కి 2 నెలలు ముందే సినిమా లో ని సాంగ్స్ ని ఒక్కొటిగా రిలీజ్ చేయగా రిలీజ్ చేసిన పాటలు అన్నింటికీ అదిరి పోయే రెస్పాన్స్ దక్కింది.

ఇక రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ కి కూడా ఫ్యాన్స్ నుండి కామన్ ఆడియన్స్ వరకు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా బిజినెస్ పరంగా కూడా సినిమా దుమ్ము లేపుతుంది, సినిమా బిజినెస్ మొత్తం మీద 4 ఏరియాల్లో ఇప్పటి వరకు కన్ఫాం అయింది…

సినిమా పోటి లో కూడా సీడెడ్ లో 12.06 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా, నైజాం లో 20 కోట్ల బిజినెస్, ను నెల్లూరులో 2.78 కోట్ల బిజినెస్ ను మరియు ఓవర్సీస్ లో 9.8 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద ఈ 4 ఏరియాల బిజినెస్ 44.64 కోట్ల మార్క్ ని అందుకుంది, ఇక మిగిలిన ఏరియాల బిజినెస్ లు రిలీజ్ అవ్వాల్సి ఉంది.

అవి కూడా అనుకున్న రేంజ్ లో ఉంటే అల వైకుంఠ పురం లో ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా 80 కోట్ల నుండి 90 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. సంక్రాంతి బరిలో జనవరి 12 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు అర్జున్ ఎలాంటి కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో అన్నది ఆసక్తి గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here