Home న్యూస్ 40 కోట్ల సినిమా….3 రోజుల వానకి ఇంత నష్టం ఏంటి సామి!!

40 కోట్ల సినిమా….3 రోజుల వానకి ఇంత నష్టం ఏంటి సామి!!

0

నాచురల్ స్టార్ నాని సాయి పల్లవి మరియు కృతి శెట్టిల కాంబినేషన్ లో పీరియాడికల్ డ్రామా గా నాని డిటెక్టివ్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్, టైటిల్ అనౌన్స్ మెంట్ నుండే మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ ఎండ్ టైం కి ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది కానీ సినిమా షూటింగ్ కి సెకెండ్ వేవ్ ఎఫెక్ట్…

కొంచం బ్రేక్ వేయగా చివరి నిమిషం వరకు యూనిట్ చాలా వరకు సన్నివేశాలను ఒక్క చోటే వేశారు, దానికి కారణం హైదరాబాదు లో ఓ 10 ఎకరాలాలో భారీ ఎత్తున వేసిన కోల్కతా సెట్ లో కీలక సన్నివేశాలు రూపొందించాల్సి ఉండగా కొన్ని సీన్స్ ని కోల్కతా వెళ్లి తీసిన…

ఇక్కడ సెట్ వేయడం బెటర్ అని ఏకంగా 6.5 కోట్ల ఖర్చు తో భారీ సెట్ ని వేయగా లాక్ డౌన్ చివరి రోజు వరకు ఎంత వీలయితే అంత షూటింగ్ చేశారు. కానీ ఇంకా బాలెన్స్ ఉండగా ఎప్పుడెప్పుడు షూటింగ్ చేసి కంప్లీట్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉండగా రీసెంట్ గా…

మూడు రోజులు హైదరాబాదు లో నాన్ స్టాప్ గా కుండపోత వర్షాలు పడటం తో ఆ దెబ్బకి ఈ సినిమా సెట్స్ కి చాలా వరకు దెబ్బ తిన్నాయట… దాంతో ఆల్ మోస్ట్ 6.5 కోట్ల ఖర్చు పెట్టిన సెట్ కి గట్టి ఎదురుదెబ్బ పడగా ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత మరింత బడ్జెట్ తో సెట్స్ కి మరమ్మత్తులు చేయించాల్సిన అవసరం ఉంది అంటూ…

టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఆల్ రెడీ సినిమా కి 40 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు బడ్జెట్ మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కానీ సినిమా పై మంచి బజ్ ఉన్న నేపధ్యంలో బిజినెస్ కూడా అలానే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే సెట్ పై అఫీషియల్ గా టీం స్పందించే అవకాశం ఉందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here